2030 నాటికి 25 శాతం డ్రైవర్లెస్ ట్రిప్పులు..!!
- July 06, 2025
దుబాయ్: దుబాయ్ లో ఈ సంవత్సరం చివర్లో డ్రైవర్లెస్ వాహనాల పైలట్ ట్రయల్స్ను ప్రారంభించనున్నారు. 2026లో పూర్తిగా డ్రైవర్లెస్ వాణిజ్య సేవను ప్రారంభించే దిశగా ఈ చొరవ ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ఈ మేరకు రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ఆటోమెటివ్ డ్రైవింగ్ టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి అయిన Pony.aiతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. విభిన్న రహదారి, వాతావరణ పరిస్థితులలో సురక్షితమైన, ఖచ్చితమైన నావిగేషన్ను నిర్ధారించడానికి అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థలతోపాటు లిడార్లు, రాడార్లు, కెమెరాలతో కూడిన బలమైన సెన్సార్ సూట్ను ఇందులో భాగంగా పరిక్షించనున్నారు.
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) డైరెక్టర్ జనరల్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. దుబాయ్ స్మార్ట్ సెల్ఫ్-డ్రైవింగ్ ట్రాన్స్పోర్ట్ స్ట్రాటజీని సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. 2030 నాటికి దుబాయ్లోని అన్ని ప్రయాణాలలో 25 శాతం ప్రయాణాలను వివిధ రవాణా మార్గాలలో ఆటోమెటివ్ ప్రయాణాలుగా మార్చడం ఈ వ్యూహం లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









