2030 నాటికి 25 శాతం డ్రైవర్లెస్ ట్రిప్పులు..!!
- July 06, 2025
దుబాయ్: దుబాయ్ లో ఈ సంవత్సరం చివర్లో డ్రైవర్లెస్ వాహనాల పైలట్ ట్రయల్స్ను ప్రారంభించనున్నారు. 2026లో పూర్తిగా డ్రైవర్లెస్ వాణిజ్య సేవను ప్రారంభించే దిశగా ఈ చొరవ ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ఈ మేరకు రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ఆటోమెటివ్ డ్రైవింగ్ టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి అయిన Pony.aiతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. విభిన్న రహదారి, వాతావరణ పరిస్థితులలో సురక్షితమైన, ఖచ్చితమైన నావిగేషన్ను నిర్ధారించడానికి అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థలతోపాటు లిడార్లు, రాడార్లు, కెమెరాలతో కూడిన బలమైన సెన్సార్ సూట్ను ఇందులో భాగంగా పరిక్షించనున్నారు.
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) డైరెక్టర్ జనరల్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. దుబాయ్ స్మార్ట్ సెల్ఫ్-డ్రైవింగ్ ట్రాన్స్పోర్ట్ స్ట్రాటజీని సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. 2030 నాటికి దుబాయ్లోని అన్ని ప్రయాణాలలో 25 శాతం ప్రయాణాలను వివిధ రవాణా మార్గాలలో ఆటోమెటివ్ ప్రయాణాలుగా మార్చడం ఈ వ్యూహం లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'