2030 నాటికి 25 శాతం డ్రైవర్లెస్ ట్రిప్పులు..!!
- July 06, 2025
దుబాయ్: దుబాయ్ లో ఈ సంవత్సరం చివర్లో డ్రైవర్లెస్ వాహనాల పైలట్ ట్రయల్స్ను ప్రారంభించనున్నారు. 2026లో పూర్తిగా డ్రైవర్లెస్ వాణిజ్య సేవను ప్రారంభించే దిశగా ఈ చొరవ ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ఈ మేరకు రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ఆటోమెటివ్ డ్రైవింగ్ టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి అయిన Pony.aiతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. విభిన్న రహదారి, వాతావరణ పరిస్థితులలో సురక్షితమైన, ఖచ్చితమైన నావిగేషన్ను నిర్ధారించడానికి అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థలతోపాటు లిడార్లు, రాడార్లు, కెమెరాలతో కూడిన బలమైన సెన్సార్ సూట్ను ఇందులో భాగంగా పరిక్షించనున్నారు.
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) డైరెక్టర్ జనరల్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. దుబాయ్ స్మార్ట్ సెల్ఫ్-డ్రైవింగ్ ట్రాన్స్పోర్ట్ స్ట్రాటజీని సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. 2030 నాటికి దుబాయ్లోని అన్ని ప్రయాణాలలో 25 శాతం ప్రయాణాలను వివిధ రవాణా మార్గాలలో ఆటోమెటివ్ ప్రయాణాలుగా మార్చడం ఈ వ్యూహం లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









