కువైట్ లో తనిఖీలు.. 30కంపెనీలపై ఉల్లంఘనలు నమోదు..!!
- July 07, 2025
కువైట్: జూన్ 1 - 30మధ్య నిర్వహించిన తనిఖీలలో 33 మంది కార్మికులు మధ్యాహ్నం పని నిషేధాన్ని ఉల్లంఘించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ప్రకటించింది. మే 31 నుండి ఆగస్టు చివరి వరకు అమలులో ఉన్న ఈ నిషేధంలో భాగంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బహిరంగ పనిని నిషేధిస్తుంది. ఇన్స్పెక్టర్లు 60 ప్రదేశాలను సందర్శించి మొదటిసారిగా 30 కంపెనీలపై ఉల్లంఘనలను నమోదు చేశారు.
ఈ కాలంలో ప్రజల నుండి 12 నివేదికలు అందాయని , 30 కంపెనీల పునః తనిఖీలను పూర్తి చేశామని కూడా అధికార యంత్రాంగం పేర్కొంది. పౌరులు, నివాసితులు మధ్యాహ్నం పని నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే 6192 2493కు వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









