తిరుపతి కపిలతీర్థం రోడ్డులో ఓ వ్యక్తి వీరంగం: ఒకరు మృతి
- July 07, 2025
తిరుపతి: తిరుపతిలో సోమవారం ఉదయం ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కపిలతీర్థం రోడ్డులో ఓ ఉన్మాది దాడికి దిగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. నడిరోడ్డుపై నిర్దాక్షిణ్యంగా జరిగిన ఈ ఘటన ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ దారుణ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రోడ్డుమీద నడుచుకుంటూ వస్తున్న ప్రజలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అతని చేతిలో కర్ర కూడా ఉండడంతో మరింత బీభత్సం సృష్టించాడు. ఈ దాడిలో శేఖర్ అనే 55 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇద్దరికి తీవ్ర గాయాలు
దాడిలో మరో ఇద్దరు–సుబ్రహ్మణ్యం, కల్పన అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గంటపాటు తీవ్ర ఒత్తిడిలో పోలీసులు
నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు దాదాపు గంటపాటు కష్టపడ్డారు. చివరకు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అతను తమిళనాడుకు చెందినవాడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆయన మానసిక స్థితి సాధారణంగా లేదని అనుమానిస్తున్నారు.
నగరంలో భయ వాతావరణం
నగర నడిబొడ్డున చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. పుణ్యభూమిగా పేరొందిన తిరుపతిలో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









