అసిర్ తీరంలో బంగ్లాదేశ్ ప్రవాసిని పట్టుకున్న కోస్ట్ గార్డ్స్..!!
- July 12, 2025
జెడ్డా: అసిర్ ప్రాంతంలోని అల్-ఖహ్మాలో సముద్ర భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు బంగ్లాదేశ్ నివాసిని సౌదీ బోర్డర్ గార్డ్ తీరప్రాంత గస్తీ బృందం అరెస్ట్ చేసింది. అనుమతి లేకుండా అతను చేపలు పట్టడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించాడని అధికారులు తెలిపారు. సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో అతనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సముద్ర జీవులు, సహజ వనరులను రక్షించే సముద్ర భద్రతా చట్టాలు, నిబంధనలను అందరూ పాటించాలని బోర్డర్ గార్డ్ పిలుపునిచ్చింది.
ఏవైనా పర్యావరణ లేదా వన్యప్రాణుల ఉల్లంఘనలను అత్యవసర నంబర్లకు కాల్ చేయడం ద్వారా నివేదించాలని కోరారు. మక్కా, మదీనాతోపాటు తూర్పు ప్రావిన్స్లో 911; అన్ని ఇతర ప్రాంతాలలో 994, 999, 996 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!









