అసిర్ తీరంలో బంగ్లాదేశ్ ప్రవాసిని పట్టుకున్న కోస్ట్ గార్డ్స్..!!
- July 12, 2025
జెడ్డా: అసిర్ ప్రాంతంలోని అల్-ఖహ్మాలో సముద్ర భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు బంగ్లాదేశ్ నివాసిని సౌదీ బోర్డర్ గార్డ్ తీరప్రాంత గస్తీ బృందం అరెస్ట్ చేసింది. అనుమతి లేకుండా అతను చేపలు పట్టడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించాడని అధికారులు తెలిపారు. సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో అతనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సముద్ర జీవులు, సహజ వనరులను రక్షించే సముద్ర భద్రతా చట్టాలు, నిబంధనలను అందరూ పాటించాలని బోర్డర్ గార్డ్ పిలుపునిచ్చింది.
ఏవైనా పర్యావరణ లేదా వన్యప్రాణుల ఉల్లంఘనలను అత్యవసర నంబర్లకు కాల్ చేయడం ద్వారా నివేదించాలని కోరారు. మక్కా, మదీనాతోపాటు తూర్పు ప్రావిన్స్లో 911; అన్ని ఇతర ప్రాంతాలలో 994, 999, 996 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







