అసిర్ తీరంలో బంగ్లాదేశ్ ప్రవాసిని పట్టుకున్న కోస్ట్ గార్డ్స్..!!
- July 12, 2025
జెడ్డా: అసిర్ ప్రాంతంలోని అల్-ఖహ్మాలో సముద్ర భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు బంగ్లాదేశ్ నివాసిని సౌదీ బోర్డర్ గార్డ్ తీరప్రాంత గస్తీ బృందం అరెస్ట్ చేసింది. అనుమతి లేకుండా అతను చేపలు పట్టడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించాడని అధికారులు తెలిపారు. సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో అతనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సముద్ర జీవులు, సహజ వనరులను రక్షించే సముద్ర భద్రతా చట్టాలు, నిబంధనలను అందరూ పాటించాలని బోర్డర్ గార్డ్ పిలుపునిచ్చింది.
ఏవైనా పర్యావరణ లేదా వన్యప్రాణుల ఉల్లంఘనలను అత్యవసర నంబర్లకు కాల్ చేయడం ద్వారా నివేదించాలని కోరారు. మక్కా, మదీనాతోపాటు తూర్పు ప్రావిన్స్లో 911; అన్ని ఇతర ప్రాంతాలలో 994, 999, 996 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







