దుబాయ్ లో మోస్ట్ వాంటెడ్ ముగ్గురు బెల్జియన్ల అరెస్టు..!!
- July 14, 2025
దుబాయ్ః ఎన్నో ఏండ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు బెల్జియన్లను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో యూరప్లోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒత్మాన్ ఎల్ బల్లౌటి కూడా ఉన్నాడు. దుబాయ్ పోలీసులు వారిని బెల్జియంకు అప్పగించారు.
'కొకైన్ కింగ్'గా పేరు పొందిన 38 ఏళ్ల బెల్జియన్-మొరాకో ఒత్మాన్ ఎల్ బల్లౌటి ని, అంతర్జాతీయ నిఘా సంస్థల సమన్వయంతో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరస్థులు మాథియాస్ అక్యాజిలి, జార్జి ఫేస్లను కూడా బెల్జియంకు అప్పగించినట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకటించింది. వీరి ముగ్గురిపై ఇంటర్పోల్ రెడ్ నోటీసులు ఉన్నాయని తెలిపింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, సాయుధ దోపిడీ, అంతర్జాతీయ నేర సంస్థను నడపడం వంటి తీవ్రమైన ఆరోపణలను నిందితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
2021లో బెల్జియం -యూఏఈ మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నిందితులను బెల్జియంకు అప్పగించినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









