రాష్ట్రపతి ఎస్కార్ట్ కారు డార్జిలింగ్ లోయలో పడిపోయింది
- July 15, 2016
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్లోని వాహనానికి ప్రమాదం సంభవించింది. ఆయన ఎస్కార్ట్ కారు డార్జిలింగ్లోని ఓ లోయలో పడిపోయింది. ప్రమాదానికి గురైన కారులోని ఆరుగురు భద్రతాసిబ్బందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. డార్జిలింగ్ మీదుగా కాన్వాయ్ వెళ్తుండగా మూలమలుపులో కారు అదుపు తప్పి లోయలో పడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ వెనకాలే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కాన్వాయ్ ఉంది. మమతా బెనర్జీ సహా ప్రణబ్ కుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ఠ కూడా దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







