బహ్రెయిన్ రోడ్డు భద్రతను పెంచిన సివిల్ ట్రాఫిక్ పెట్రోల్స్..!!
- July 15, 2025
మనామా: సివిల్ పెట్రోల్ వాహనాలను ఉపయోగించి కొత్త ఫీల్డ్ ప్రచారాలను ప్రారంభించినట్టు జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఈ వాహనాలు ప్రమాదకరమైన డ్రైవింగ్ అలవాట్లను నిశ్శబ్దంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సిగ్నల్ జంప్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం, పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం వంటి ప్రాణాలను ప్రమాదంలో పడేసే వాటిపై ఫోకస్ చేస్తాయని ప్రకటించారు. సివిల్ పెట్రోల్స్ 24/7 పనిచేసే పెద్ద రహదారి భద్రతా మిషన్లో భాగంగా ఉంటాయన్నారు.
గతంలో కంటే ఎక్కువ కార్లు రోడ్డుపై ఉన్నందున, డైరెక్టరేట్ అన్ని డ్రైవర్లను ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరింది. జరిమానాల భయంతో మాత్రమే కాకుండా, సమాజం పట్ల శ్రద్ధతో వాహనదారులు జాగ్రత్తగా, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది.
పెట్రోల్స్ వాహనాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఒకప్పుడు ఉల్లంఘనలకు కేంద్రాలుగా ఉన్న అధిక-ప్రమాదకర ప్రాంతాలలో ప్రచారం మంచి ఫలితాలను చూపిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రచారం కేవలం డ్రైవర్లకు జరిమానాల గురించి మాత్రమే కాదని, ఇదివారికి అవగాహన కల్పించడంతో పాటు వారిలో సరైన మార్పులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. వివిధ ప్రాంతాలలో నిత్యం తిరుగుతూ.. ఈ సివిల్ పెట్రోలింగ్లు బహ్రెయిన్ రోడ్లను దశలవారీగా సురక్షితంగా చేస్తున్నాయని అధికారు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!