మహబౌలాలోని రెసిడెన్సీ భవనంలో అగ్నిప్రమాదం.. ఫలించిన చర్యలు..!!
- July 15, 2025
కువైట్: సోమవారం సాయంత్రం మహబౌలా ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను విజయవంతంగా అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మంగాఫ్, ఫహాహీల్ అగ్నిమాపక కేంద్రాల బృందాలు అత్యవసర పరిస్థితికి వెంటనే స్పందించి మంటలను సమర్థవంతంగా అదుపు చేశాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది.
అగ్నిమాపక బృందాలు వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, నివాసితుల ప్రాణాలను కాపాడాయి. మంటలు మరింత వ్యాపించకుండా నిరోధించారు. వారి వేగవంతమైన చర్యల కారణంగా ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.కాగా, అగ్ని ప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









