మహబౌలాలోని రెసిడెన్సీ భవనంలో అగ్నిప్రమాదం.. ఫలించిన చర్యలు..!!
- July 15, 2025
కువైట్: సోమవారం సాయంత్రం మహబౌలా ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను విజయవంతంగా అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మంగాఫ్, ఫహాహీల్ అగ్నిమాపక కేంద్రాల బృందాలు అత్యవసర పరిస్థితికి వెంటనే స్పందించి మంటలను సమర్థవంతంగా అదుపు చేశాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది.
అగ్నిమాపక బృందాలు వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, నివాసితుల ప్రాణాలను కాపాడాయి. మంటలు మరింత వ్యాపించకుండా నిరోధించారు. వారి వేగవంతమైన చర్యల కారణంగా ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.కాగా, అగ్ని ప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









