మహబౌలాలోని రెసిడెన్సీ భవనంలో అగ్నిప్రమాదం.. ఫలించిన చర్యలు..!!
- July 15, 2025
కువైట్: సోమవారం సాయంత్రం మహబౌలా ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను విజయవంతంగా అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మంగాఫ్, ఫహాహీల్ అగ్నిమాపక కేంద్రాల బృందాలు అత్యవసర పరిస్థితికి వెంటనే స్పందించి మంటలను సమర్థవంతంగా అదుపు చేశాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది.
అగ్నిమాపక బృందాలు వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, నివాసితుల ప్రాణాలను కాపాడాయి. మంటలు మరింత వ్యాపించకుండా నిరోధించారు. వారి వేగవంతమైన చర్యల కారణంగా ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.కాగా, అగ్ని ప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







