మహబౌలాలోని రెసిడెన్సీ భవనంలో అగ్నిప్రమాదం.. ఫలించిన చర్యలు..!!
- July 15, 2025
కువైట్: సోమవారం సాయంత్రం మహబౌలా ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను విజయవంతంగా అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మంగాఫ్, ఫహాహీల్ అగ్నిమాపక కేంద్రాల బృందాలు అత్యవసర పరిస్థితికి వెంటనే స్పందించి మంటలను సమర్థవంతంగా అదుపు చేశాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది.
అగ్నిమాపక బృందాలు వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, నివాసితుల ప్రాణాలను కాపాడాయి. మంటలు మరింత వ్యాపించకుండా నిరోధించారు. వారి వేగవంతమైన చర్యల కారణంగా ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.కాగా, అగ్ని ప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







