చిరంజీవి ఇంటి విషయంలో GHMCకి హైకోర్టు కీలక ఆదేశాలు
- July 15, 2025
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇంటి విషయంలో జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ మెగాస్టార్ చిరంజీవి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన రిటైన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5న దరఖాస్తు చేసుకున్నా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2002లో అనుమతి తీసుకుని జీ+2 ఇంటిని నిర్మించినట్లు తెలిపారు. తరువాత పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది.. చట్టప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!







