చిరంజీవి ఇంటి విషయంలో GHMCకి హైకోర్టు కీలక ఆదేశాలు
- July 15, 2025
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇంటి విషయంలో జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ మెగాస్టార్ చిరంజీవి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన రిటైన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5న దరఖాస్తు చేసుకున్నా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2002లో అనుమతి తీసుకుని జీ+2 ఇంటిని నిర్మించినట్లు తెలిపారు. తరువాత పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది.. చట్టప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









