అబుదాబిలో వాలీబాల్ తో ఆశ్చర్యపరిచిన యూఏఈ ఉపాధ్యక్షుడు..!!
- July 18, 2025
యూఏఈ: అబుదాబిలో నివాసితులతో వాలీబాల్ ఆడి యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీడియోను వామ్ షేర్ చేసింది. కమ్యూనిటీ సభ్యులు, అథ్లెట్లతో కలిసి వాలీబాల్ ఆడటం అందులో కనిపించింది. ఈ సందర్భంగా 'అబుదాబి సమ్మర్ స్పోర్ట్స్' ఈవెంట్ నిర్వాహకులు వారికి షెడ్యూల్ గురించి వివరించారు. అనంతరం కొన్ని ప్రధాన సౌకర్యాలను సందర్శించారు.
యూఏఈ ప్రస్తుత నాయకత్వం క్రీడల పట్ల బలమైన అనుబంధం కొనసాగుతుంది. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ను నడిపిస్తున్నారు. అలాగే, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్.. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. జియు-జిట్సు ప్రాక్టీస్ చేస్తారు. గల్ఫ్ ప్రాంతంలో మొట్టమొదటి NBA గేమ్ను నిర్వహించడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తరచూ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోలను Instagramలో షేర్ చేస్తుంటారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







