అబుదాబిలో వాలీబాల్ తో ఆశ్చర్యపరిచిన యూఏఈ ఉపాధ్యక్షుడు..!!
- July 18, 2025
యూఏఈ: అబుదాబిలో నివాసితులతో వాలీబాల్ ఆడి యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీడియోను వామ్ షేర్ చేసింది. కమ్యూనిటీ సభ్యులు, అథ్లెట్లతో కలిసి వాలీబాల్ ఆడటం అందులో కనిపించింది. ఈ సందర్భంగా 'అబుదాబి సమ్మర్ స్పోర్ట్స్' ఈవెంట్ నిర్వాహకులు వారికి షెడ్యూల్ గురించి వివరించారు. అనంతరం కొన్ని ప్రధాన సౌకర్యాలను సందర్శించారు.
యూఏఈ ప్రస్తుత నాయకత్వం క్రీడల పట్ల బలమైన అనుబంధం కొనసాగుతుంది. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ను నడిపిస్తున్నారు. అలాగే, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్.. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. జియు-జిట్సు ప్రాక్టీస్ చేస్తారు. గల్ఫ్ ప్రాంతంలో మొట్టమొదటి NBA గేమ్ను నిర్వహించడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తరచూ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోలను Instagramలో షేర్ చేస్తుంటారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









