అబుదాబిలో వాలీబాల్ తో ఆశ్చర్యపరిచిన యూఏఈ ఉపాధ్యక్షుడు..!!
- July 18, 2025
యూఏఈ: అబుదాబిలో నివాసితులతో వాలీబాల్ ఆడి యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీడియోను వామ్ షేర్ చేసింది. కమ్యూనిటీ సభ్యులు, అథ్లెట్లతో కలిసి వాలీబాల్ ఆడటం అందులో కనిపించింది. ఈ సందర్భంగా 'అబుదాబి సమ్మర్ స్పోర్ట్స్' ఈవెంట్ నిర్వాహకులు వారికి షెడ్యూల్ గురించి వివరించారు. అనంతరం కొన్ని ప్రధాన సౌకర్యాలను సందర్శించారు.
యూఏఈ ప్రస్తుత నాయకత్వం క్రీడల పట్ల బలమైన అనుబంధం కొనసాగుతుంది. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ను నడిపిస్తున్నారు. అలాగే, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్.. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. జియు-జిట్సు ప్రాక్టీస్ చేస్తారు. గల్ఫ్ ప్రాంతంలో మొట్టమొదటి NBA గేమ్ను నిర్వహించడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తరచూ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోలను Instagramలో షేర్ చేస్తుంటారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







