అబుదాబిలో వాలీబాల్ తో ఆశ్చర్యపరిచిన యూఏఈ ఉపాధ్యక్షుడు..!!
- July 18, 2025
యూఏఈ: అబుదాబిలో నివాసితులతో వాలీబాల్ ఆడి యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీడియోను వామ్ షేర్ చేసింది. కమ్యూనిటీ సభ్యులు, అథ్లెట్లతో కలిసి వాలీబాల్ ఆడటం అందులో కనిపించింది. ఈ సందర్భంగా 'అబుదాబి సమ్మర్ స్పోర్ట్స్' ఈవెంట్ నిర్వాహకులు వారికి షెడ్యూల్ గురించి వివరించారు. అనంతరం కొన్ని ప్రధాన సౌకర్యాలను సందర్శించారు.
యూఏఈ ప్రస్తుత నాయకత్వం క్రీడల పట్ల బలమైన అనుబంధం కొనసాగుతుంది. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ను నడిపిస్తున్నారు. అలాగే, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్.. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. జియు-జిట్సు ప్రాక్టీస్ చేస్తారు. గల్ఫ్ ప్రాంతంలో మొట్టమొదటి NBA గేమ్ను నిర్వహించడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తరచూ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోలను Instagramలో షేర్ చేస్తుంటారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









