నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయం..భారీ జరిమానా,మూసివేత..!!
- July 18, 2025
రియాద్: నాణ్యత లేని విద్యుత్ ఉత్పత్తులను కలిగి ఉండటం, విక్రయించడం ద్వారా వాణిజ్య నిరోధక మోస చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఫైనల్ కోర్టు తీర్పు ప్రకటించింది. సదరు సంస్థను మూసివేయడంతోపాటు భారీ జరిమానా విధించింది.
ఖమిస్ ముషాయిత్లో మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు సాధారణ తనిఖీల్లో సంస్థలో అమ్మకానికి పెట్టిన వస్తువులు నాణ్యంగా లేవని నిర్ధారించారు. అసిర్ ప్రాంతంలోని అప్పీళ్ల కోర్టు ఫైనల్ తీర్పులో ఆర్థిక జరిమానా విధించింది. అలాగే, వ్యాపారాన్ని మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. మోసపూరిత వస్తువులను జప్తు చేసి నాశనం చేయాలని ఆదేశించింది.
చట్టాన్ని అమలు చేయడానికి, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. వాణిజ్య మోస నిరోధక చట్టం కింద జరిమానాలలో నేరస్థుల బహిరంగ పేర్లను ప్రకటించడంతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







