నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయం..భారీ జరిమానా,మూసివేత..!!
- July 18, 2025
రియాద్: నాణ్యత లేని విద్యుత్ ఉత్పత్తులను కలిగి ఉండటం, విక్రయించడం ద్వారా వాణిజ్య నిరోధక మోస చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఫైనల్ కోర్టు తీర్పు ప్రకటించింది. సదరు సంస్థను మూసివేయడంతోపాటు భారీ జరిమానా విధించింది.
ఖమిస్ ముషాయిత్లో మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు సాధారణ తనిఖీల్లో సంస్థలో అమ్మకానికి పెట్టిన వస్తువులు నాణ్యంగా లేవని నిర్ధారించారు. అసిర్ ప్రాంతంలోని అప్పీళ్ల కోర్టు ఫైనల్ తీర్పులో ఆర్థిక జరిమానా విధించింది. అలాగే, వ్యాపారాన్ని మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. మోసపూరిత వస్తువులను జప్తు చేసి నాశనం చేయాలని ఆదేశించింది.
చట్టాన్ని అమలు చేయడానికి, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. వాణిజ్య మోస నిరోధక చట్టం కింద జరిమానాలలో నేరస్థుల బహిరంగ పేర్లను ప్రకటించడంతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









