ఇబ్రహీమి మస్జీదు..ఇజ్రాయెల్ ప్రణాళికను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- July 20, 2025
దోహా: ఇబ్రహీమి మస్జీదు పరిపాలన, పర్యవేక్షణ అధికారాన్ని పాలస్తీనా అవ్కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హెబ్రాన్ మునిసిపాలిటీ నుండి కిర్యాట్ అర్బా సెటిల్మెంట్లోని యూదు మత మండలికి బదిలీ చేయాలనే ఇజ్రాయెల్ ప్రణాళికను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలు, చట్టబద్ధమైన అంతర్జాతీయ తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘించడం అని పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల భావాలను రెచ్చగొట్టడం అని అభివర్ణించింది.
ఇబ్రహీమి మస్జీదు, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని అన్ని పవిత్ర స్థలాల చారిత్రక, చట్టపరమైన స్థితిని మార్చడానికి చేసిన ప్రయత్నాలను ఖతార్ పూర్తిగా తిరస్కరిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనాలోని మతపరమైన పవిత్రతలను కాపాడటానికి, పాలస్తీనా ప్రజల నిజమైన గుర్తింపును తుడిచిపెట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ నేరపూరిత ప్రణాళికలను ఆపేలా అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









