ఇబ్రహీమి మస్జీదు..ఇజ్రాయెల్ ప్రణాళికను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- July 20, 2025
దోహా: ఇబ్రహీమి మస్జీదు పరిపాలన, పర్యవేక్షణ అధికారాన్ని పాలస్తీనా అవ్కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హెబ్రాన్ మునిసిపాలిటీ నుండి కిర్యాట్ అర్బా సెటిల్మెంట్లోని యూదు మత మండలికి బదిలీ చేయాలనే ఇజ్రాయెల్ ప్రణాళికను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలు, చట్టబద్ధమైన అంతర్జాతీయ తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘించడం అని పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల భావాలను రెచ్చగొట్టడం అని అభివర్ణించింది.
ఇబ్రహీమి మస్జీదు, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని అన్ని పవిత్ర స్థలాల చారిత్రక, చట్టపరమైన స్థితిని మార్చడానికి చేసిన ప్రయత్నాలను ఖతార్ పూర్తిగా తిరస్కరిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనాలోని మతపరమైన పవిత్రతలను కాపాడటానికి, పాలస్తీనా ప్రజల నిజమైన గుర్తింపును తుడిచిపెట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ నేరపూరిత ప్రణాళికలను ఆపేలా అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









