ఇబ్రహీమి మస్జీదు..ఇజ్రాయెల్ ప్రణాళికను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- July 20, 2025
దోహా: ఇబ్రహీమి మస్జీదు పరిపాలన, పర్యవేక్షణ అధికారాన్ని పాలస్తీనా అవ్కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హెబ్రాన్ మునిసిపాలిటీ నుండి కిర్యాట్ అర్బా సెటిల్మెంట్లోని యూదు మత మండలికి బదిలీ చేయాలనే ఇజ్రాయెల్ ప్రణాళికను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలు, చట్టబద్ధమైన అంతర్జాతీయ తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘించడం అని పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల భావాలను రెచ్చగొట్టడం అని అభివర్ణించింది.
ఇబ్రహీమి మస్జీదు, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని అన్ని పవిత్ర స్థలాల చారిత్రక, చట్టపరమైన స్థితిని మార్చడానికి చేసిన ప్రయత్నాలను ఖతార్ పూర్తిగా తిరస్కరిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనాలోని మతపరమైన పవిత్రతలను కాపాడటానికి, పాలస్తీనా ప్రజల నిజమైన గుర్తింపును తుడిచిపెట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ నేరపూరిత ప్రణాళికలను ఆపేలా అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







