ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- July 20, 2025
కువైట్: షార్క్ ఫిష్ మార్కెట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 10 టన్నుల చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీజ్ చేసిన సీ ఫుడ్ ను నాశనం చేస్తామని జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రకటించింది. బాధ్యులను చట్టపరంగా శిక్షించేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.
కువైట్ లో ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ఆహార భద్రతను కాపాడేందుకు అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్ జరిగిందని క్యాపిటల్ గవర్నరేట్ తనిఖీ విభాగం డైరెక్టర్ అలీ అల్-కందారి తెలిపారు. నాలుగు రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను ఆపి తనిఖీలు చేశామని, వాటిలోని మొత్తం వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. “ప్రజారోగ్యానికి హాని కలిగించే కల్తీ లేదా గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయాలు చేస్తే ఎవరినైనా ఫుడ్ అథారిటీ ఉక్కుపాదంతో అణిచివేస్తుంది.” అని అల్-కందారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







