ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- July 20, 2025
కువైట్: షార్క్ ఫిష్ మార్కెట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 10 టన్నుల చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీజ్ చేసిన సీ ఫుడ్ ను నాశనం చేస్తామని జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రకటించింది. బాధ్యులను చట్టపరంగా శిక్షించేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.
కువైట్ లో ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ఆహార భద్రతను కాపాడేందుకు అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్ జరిగిందని క్యాపిటల్ గవర్నరేట్ తనిఖీ విభాగం డైరెక్టర్ అలీ అల్-కందారి తెలిపారు. నాలుగు రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను ఆపి తనిఖీలు చేశామని, వాటిలోని మొత్తం వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. “ప్రజారోగ్యానికి హాని కలిగించే కల్తీ లేదా గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయాలు చేస్తే ఎవరినైనా ఫుడ్ అథారిటీ ఉక్కుపాదంతో అణిచివేస్తుంది.” అని అల్-కందారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







