ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- July 20, 2025
కువైట్: షార్క్ ఫిష్ మార్కెట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 10 టన్నుల చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీజ్ చేసిన సీ ఫుడ్ ను నాశనం చేస్తామని జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రకటించింది. బాధ్యులను చట్టపరంగా శిక్షించేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.
కువైట్ లో ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ఆహార భద్రతను కాపాడేందుకు అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్ జరిగిందని క్యాపిటల్ గవర్నరేట్ తనిఖీ విభాగం డైరెక్టర్ అలీ అల్-కందారి తెలిపారు. నాలుగు రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను ఆపి తనిఖీలు చేశామని, వాటిలోని మొత్తం వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. “ప్రజారోగ్యానికి హాని కలిగించే కల్తీ లేదా గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయాలు చేస్తే ఎవరినైనా ఫుడ్ అథారిటీ ఉక్కుపాదంతో అణిచివేస్తుంది.” అని అల్-కందారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







