ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- July 20, 2025
కువైట్: షార్క్ ఫిష్ మార్కెట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 10 టన్నుల చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీజ్ చేసిన సీ ఫుడ్ ను నాశనం చేస్తామని జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రకటించింది. బాధ్యులను చట్టపరంగా శిక్షించేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు.
కువైట్ లో ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ఆహార భద్రతను కాపాడేందుకు అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్ జరిగిందని క్యాపిటల్ గవర్నరేట్ తనిఖీ విభాగం డైరెక్టర్ అలీ అల్-కందారి తెలిపారు. నాలుగు రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను ఆపి తనిఖీలు చేశామని, వాటిలోని మొత్తం వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. “ప్రజారోగ్యానికి హాని కలిగించే కల్తీ లేదా గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయాలు చేస్తే ఎవరినైనా ఫుడ్ అథారిటీ ఉక్కుపాదంతో అణిచివేస్తుంది.” అని అల్-కందారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









