తిరుపతి–హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్కు తప్పిన ప్రమాదం
- July 21, 2025
తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. ప్రమాదాన్ని తప్పించడమే కాకుండా, ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు.సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే పైలట్ స్పందించాడు. విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో, దాదాపు 40 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ఆందోళన పెరిగింది. చివరకు తిరుపతికే తిరిగి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
సర్వీస్ రద్దు.. ప్రయాణికుల ఆగ్రహం
విమానాన్ని నేల మీదకు తీసుకొచ్చిన తర్వాత, ఇండిగో టెక్నికల్ టీమ్ తనిఖీలు చేపట్టింది. సమస్యను గుర్తించిన వెంటనే ఇండిగో సర్వీస్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో, వారు విమానాశ్రయంలో నిరసన వ్యక్తం చేశారు. గమ్యస్థానానికి వెళ్లేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
బదులుగా రీఫండ్ మాత్రమే!
ఇండిగో అధికారులు స్పందిస్తూ, సాంకేతిక లోపం కారణంగా విమాన సర్వీస్ను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తామని పేర్కొన్నారు. అయితే ప్రయాణికులకు ఇది సరిపోలేదు. వారు ఎదుర్కొన్న అసౌకర్యానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడం ప్రయాణికులను తీవ్రంగా కుదిపేసింది.
భద్రతే ముఖ్యమని చెప్పిన ఇండిగో
ఇండిగో సంస్థ భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికుల ప్రాణాలకు ఏ మాత్రం ముప్పు ఉండదని, అందుకే జాగ్రత్తగా వ్యవహరించామని వెల్లడించింది. పైలట్ స్పందనతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









