తిరుపతి–హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్కు తప్పిన ప్రమాదం
- July 21, 2025
తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. ప్రమాదాన్ని తప్పించడమే కాకుండా, ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు.సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే పైలట్ స్పందించాడు. విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో, దాదాపు 40 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ఆందోళన పెరిగింది. చివరకు తిరుపతికే తిరిగి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
సర్వీస్ రద్దు.. ప్రయాణికుల ఆగ్రహం
విమానాన్ని నేల మీదకు తీసుకొచ్చిన తర్వాత, ఇండిగో టెక్నికల్ టీమ్ తనిఖీలు చేపట్టింది. సమస్యను గుర్తించిన వెంటనే ఇండిగో సర్వీస్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో, వారు విమానాశ్రయంలో నిరసన వ్యక్తం చేశారు. గమ్యస్థానానికి వెళ్లేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
బదులుగా రీఫండ్ మాత్రమే!
ఇండిగో అధికారులు స్పందిస్తూ, సాంకేతిక లోపం కారణంగా విమాన సర్వీస్ను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తామని పేర్కొన్నారు. అయితే ప్రయాణికులకు ఇది సరిపోలేదు. వారు ఎదుర్కొన్న అసౌకర్యానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడం ప్రయాణికులను తీవ్రంగా కుదిపేసింది.
భద్రతే ముఖ్యమని చెప్పిన ఇండిగో
ఇండిగో సంస్థ భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికుల ప్రాణాలకు ఏ మాత్రం ముప్పు ఉండదని, అందుకే జాగ్రత్తగా వ్యవహరించామని వెల్లడించింది. పైలట్ స్పందనతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









