హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసులు
- July 21, 2025
హైదరాబాద్: నేడు సాయంత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి కొంతమంది ఫ్యాన్స్ కి మాత్రమే అనుమతి ఇచ్చారు.తాజాగా ఈ ఈవెంట్ కి పోలీస్ పర్మిషన్ క్లియర్ అయింది. దీనిపై పోలీసులు మాట్లాడారు.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు.వెయ్యి నుంచి 1500 మందికి మాత్రమే అనుమతి ఉంది.ఈవెంట్ కి నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండిషన్ పెట్టారు. బయట క్రౌడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని పోలీసులు తెలిపారు.
దీంతో ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చినా మొత్తం ఈవెంట్ కి నిర్మాతనే సంబంధం, సెక్యూరిటీ పరంగా కూడా లోపల, బయట నిర్మాతే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







