తెలంగాణలో భారీ వర్షాలు..14 జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ
- July 25, 2025
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.ఈరోజు (జులై 25) తెలంగాణలోని 14 జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాల్లో కుమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి ఉన్నాయి. బుధవారం నుండి గురువారం ఉదయం వరకు ఆసిఫాబాద్ లోని బెజ్జూర్ లో అత్యధికంగా 236.8 మి.మీ వర్షపాతం నమోదైంది.ములుగులోని వెంకటాపురంలో 218.5 మి.మీ, కరీంనగర్ లోని మానకొండూర్ లో 145 మి.మీ వర్షపాతం నమోదైంది.హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.జూలై 23న సైబరాబాద్ పోలీసులు వర్షాల హెచ్చరిక నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) కు సిఫార్సు చేశారు.వాతావరణ శాఖ సూచనల ప్రకారం, వచ్చే కొన్ని రోజులు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!