ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్లో శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు
- July 25, 2025
తిరుపతి: తిరుపతి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో టీటీడీ ప్రతి రోజు నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లును ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్లో మాత్రమే జారీ చేస్తారు.
ప్రతి రోజు భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1వ తేదీ నుండి మొత్తం 200 టికెట్లు ఆన్లైన్లో మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.ఈ విశేషహోమంలో రూ.1600/- చెల్లించి గృహస్తులకు (ఇద్దరు) పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న గృహస్తులకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!