ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్లో శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు
- July 25, 2025
తిరుపతి: తిరుపతి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో టీటీడీ ప్రతి రోజు నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లును ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్లో మాత్రమే జారీ చేస్తారు.
ప్రతి రోజు భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1వ తేదీ నుండి మొత్తం 200 టికెట్లు ఆన్లైన్లో మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.ఈ విశేషహోమంలో రూ.1600/- చెల్లించి గృహస్తులకు (ఇద్దరు) పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న గృహస్తులకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







