ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్లో శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు
- July 25, 2025
తిరుపతి: తిరుపతి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో టీటీడీ ప్రతి రోజు నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లును ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్లో మాత్రమే జారీ చేస్తారు.
ప్రతి రోజు భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1వ తేదీ నుండి మొత్తం 200 టికెట్లు ఆన్లైన్లో మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.ఈ విశేషహోమంలో రూ.1600/- చెల్లించి గృహస్తులకు (ఇద్దరు) పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న గృహస్తులకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







