సోషల్మీడియా సైట్లను ప్రభుత్వం బ్లాక్ : టర్కీ
- July 16, 2016
టర్కీలో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్మీడియా సైట్లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ను బ్లాక్ చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే సోషల్మీడియా సేవలను పునురుద్ధరించినట్లు ఓ రీసెర్చ్ ఏజెన్సీ తెలిపింది. అయితే దీనిపై ట్విట్టర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సైట్ను పూర్తిగా బ్లాక్ చేయలేదని తెలిపారు. యూట్యూబ్ ప్రతినిధులు స్పందిస్తూ.. కొంతసేపు తమ సేవలు డౌన్ అయ్యాయని.. అయితే ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
టర్కీ సైన్యంలోని ఓ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది పోలీసులు సహా 60 మంది మృతిచెందారు. తిరుగుబాటు నేపథ్యంలో 754 మంది సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







