నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
- July 27, 2025
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. గతంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో నమోదైన రెండు కేసులపై ఈరోజు విచారణ జరిగింది.కోర్టు ముందు విచారణ జరిగిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి హాజరయ్యారు.ఈ కేసులు 2021లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో నమోదయ్యాయి.అప్పట్లో ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ర్యాలీలకు సంబంధించి రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసులు నమోదు చేశారు.వాటిలో ట్రాఫిక్ కు ఆటంకం కలిగించడము, పబ్లిక్ ఆర్డర్ భంగం, అనుమతి లేకుండా బహిరంగ సభలు నిర్వహించడంపై నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు ఉన్నాయి.
నాంపల్లి కోర్టు ముందు ఈ రెండు కేసులపై వాదనలు వినిపించాయి.ప్రభుత్వ వాదనలతో పాటు, రేవంత్ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు సమర్పించారు.ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, కోర్టు కేసును ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.తదుపరి విచారణలో మరిన్ని ఆధారాలు సమర్పించే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!







