ఒమన్ ఎయిర్ పోర్టుల్లో పెరిగిన ప్రయాణీకుల రద్దీ..!!
- July 27, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్టుల్లో జూన్ నెలకు సంబంధించి ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో 1,109,745 మంది ప్రయాణికులతో పోలిస్తే గత నెల 1,134,924 కు చేరుకుంది. ఏడాది పొడవునా ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా ఒమన్ స్థానాన్ని జరుగుతున్న కార్యక్రమాల కారణంగా ఈ వృద్ధీ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణీకులకు సహాయపడే తాజా టెక్నాలజీలు, స్మార్ట్ సేవలను అమలు చేయడం ద్వారా ఒమన్ ఎయిర్ పోర్ట్స్ సజావుగా, సురక్షితంగా, అధిక-నాణ్యత ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. ధోఫర్ గవర్నరేట్ లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో ఎయిర్ పోర్టల్లో రద్దీ నెలకొన్నదని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!









