ఒమన్ ఎయిర్ పోర్టుల్లో పెరిగిన ప్రయాణీకుల రద్దీ..!!
- July 27, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్టుల్లో జూన్ నెలకు సంబంధించి ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో 1,109,745 మంది ప్రయాణికులతో పోలిస్తే గత నెల 1,134,924 కు చేరుకుంది. ఏడాది పొడవునా ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా ఒమన్ స్థానాన్ని జరుగుతున్న కార్యక్రమాల కారణంగా ఈ వృద్ధీ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణీకులకు సహాయపడే తాజా టెక్నాలజీలు, స్మార్ట్ సేవలను అమలు చేయడం ద్వారా ఒమన్ ఎయిర్ పోర్ట్స్ సజావుగా, సురక్షితంగా, అధిక-నాణ్యత ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. ధోఫర్ గవర్నరేట్ లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంతో సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో ఎయిర్ పోర్టల్లో రద్దీ నెలకొన్నదని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







