బహ్రెయిన్ లో సీనియర్లు, వికలాంగులకు స్పెషల్ సర్వీసులు..!!
- July 28, 2025
మనామా: సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు మద్దతు ఇవ్వడానికి కొత్త చర్యలను బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. చీఫ్ ప్రాసిక్యూటర్ నయీఫ్ యూసిఫ్ మహమూద్ మాట్లాడుతూ.. ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్న సేవలను విస్తరించడంపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న ప్రస్తుత ప్రత్యేక విధానాలతోపాటు వారి మరింత వెసులుబాటును అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి గౌరవాన్ని కాపాడేందుకు, ముఖ్యంగా అందరికీ సమానంగా న్యాయం పొందేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని మహమూద్ అన్నారు.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని లిటిగెంట్స్ సర్వీస్ సెంటర్ ను ఆదేశించినట్లు తెలిపారు. వయస్సు లేదా వైకల్యం కారణంగా వ్యక్తిగతంగా హాజరు కావడం కష్టంగా ఉన్న సందర్భాల్లో రిమోట్గా ప్రశ్నించడానికి టెక్నాలజీని ఉపయోగించడం వంటివి ఉంటాయని తెలిపారు. వీరి దర్యాప్తులు త్వరగా పూర్తయ్యేలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. వృద్ధులు లేదా వికలాంగులకు సంబంధించిన అన్ని కేసులను లాగ్ చేయడానికి, చట్టపరమైన ప్రక్రియలో తీసుకున్న ప్రతి అడుగును ట్రాక్ చేయడానికి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయబడుతుందని స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!









