బహ్రెయిన్ లో సీనియర్లు, వికలాంగులకు స్పెషల్ సర్వీసులు..!!
- July 28, 2025
మనామా: సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు మద్దతు ఇవ్వడానికి కొత్త చర్యలను బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. చీఫ్ ప్రాసిక్యూటర్ నయీఫ్ యూసిఫ్ మహమూద్ మాట్లాడుతూ.. ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్న సేవలను విస్తరించడంపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న ప్రస్తుత ప్రత్యేక విధానాలతోపాటు వారి మరింత వెసులుబాటును అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి గౌరవాన్ని కాపాడేందుకు, ముఖ్యంగా అందరికీ సమానంగా న్యాయం పొందేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని మహమూద్ అన్నారు.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని లిటిగెంట్స్ సర్వీస్ సెంటర్ ను ఆదేశించినట్లు తెలిపారు. వయస్సు లేదా వైకల్యం కారణంగా వ్యక్తిగతంగా హాజరు కావడం కష్టంగా ఉన్న సందర్భాల్లో రిమోట్గా ప్రశ్నించడానికి టెక్నాలజీని ఉపయోగించడం వంటివి ఉంటాయని తెలిపారు. వీరి దర్యాప్తులు త్వరగా పూర్తయ్యేలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. వృద్ధులు లేదా వికలాంగులకు సంబంధించిన అన్ని కేసులను లాగ్ చేయడానికి, చట్టపరమైన ప్రక్రియలో తీసుకున్న ప్రతి అడుగును ట్రాక్ చేయడానికి ఎలక్ట్రానిక్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయబడుతుందని స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









