ట్రక్కును ఢీకొట్టిన కన్వర్ యాత్రికుల బస్సు.. 18మంది మృతి
- July 29, 2025
ఝార్ఖండ్ రాష్ట్రం దేవ్ఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18మంది కన్వర్ యాత్రికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
దేవ్ఘడ్లోని బాబాధామ్ నుంచి డుమ్కాలోని బాసుకీనాథ్ ఆలయానికి కన్వర్ యాత్రికులతో 32 సీట్లతో కూడిన బస్సు వెళ్తుంది. ఈ బస్సులో అందరూ కన్వర్ యాత్రికులే ఉన్నారు. మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ట్రక్కును కన్వర్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి స్థానిక తరలించారు. చికిత్స పొందుతూ మరో కొందరు చనిపోయారు. మొత్తం ఈ ప్రమాదంలో 18మంది మరణించినట్లు గుర్తించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని డీఐజీ సంతల్ ప్రజ్ఞా తెలిపారు. ఈ ప్రమాదం తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైంది.
ఈ ఘోర ప్రమాదంపై గొడ్డా నియోజకవర్గం బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తన ‘ఎక్స్’ ఖాతాలో ఇలా పేర్కొన్నారు. ‘శ్రావణ మాసంలో కన్వర్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా నా లోక్సభ నియోజకవర్గం పరిధి దేవ్ఘర్లో బస్సు, ట్రక్కు ఢీకున్న ప్రమాదంలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి









