సలాలాలో OMR80 మిలియన్లతో టూరిజం కాంప్లెక్స్..!!
- July 29, 2025
సలాలా: దోఫర్ గవర్నరేట్లో పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా సలాలాలోని జునుఫ్ ప్రాంతంలో OMR80 మిలియన్లతో ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్ ను నిర్మించనునున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఫిబ్రవరి 2025లో కుదిరిన యూజ్ఫ్రక్ట్ ఒప్పందం ప్రకారం అల్-వాత్బా హాస్పిటాలిటీ కంపెనీతో భాగస్వామ్యంతో దీనిని అమలు చేయనున్నారు.
30నెలల్లో మొదటి దశలో 124 గెస్ట్ యూనిట్లతో కూడిన ఫైవ్ స్టార్స్ హోటల్, రెస్టారెంట్లు, కేఫ్లతో కూడిన మెరీనా, బీచ్ క్లబ్, హెల్త్ క్లబ్, కాంప్లెక్స్ మెయిన్ డోర్ వర్క్ షెడ్యూల్ లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్లో గొప్ప సహజ, పర్యావరణ వైవిధ్యాన్ని కలిగి ఉన్న దోఫర్లో పర్యాటక స్పాట్ లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు ఈ ప్రాజెక్ట్ అదనపు బలాన్ని ఇస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!









