ట్రావెలర్ జెమ్ స్టోన్స్ సీజ్ పై ఖతార్ కస్టమ్స్ క్లారిటీ..!!
- July 29, 2025
దోహా, ఖతార్: ఓ ట్రావెలర్ వద్ద దొరికిన జెమ్ స్టోన్స్ స్వాధీనంపై ఒక ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుకు ఖతార్లోని జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ క్లారిటీ ఇచ్చింది.
మనీలాండరింగ్, ఉగ్రవాద నిధులను ఎదుర్కోవడంపై 2019 చట్టం నంబర్ (20) , 2019 మంత్రుల మండలి నిర్ణయం నంబర్ (41) జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రయాణికుల కస్టమ్స్ డిక్లరేషన్లను అమలు చేయడానికి జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ బాధ్యత వహిస్తుంది. ఈ చట్టం ప్రకారం, వచ్చే బయలుదేరే ప్రయాణికులందరూ తమ వద్ద ఉన్న ఏదైనా కరెన్సీ, విలువైన అభరణాలు లేదా జెమ్ స్టోన్స్ విలువ QAR 50,000కి సమానం లేదా మించి ఉంటే లేదా ఇతర కరెన్సీలలో దానికి సమానమైన విలువను కలిగి ఉంటే ఆమోదించబడిన డిక్లరేషన్ ఫారమ్ను పూర్తి చేయడం ద్వారా ప్రకటించాలి.
కాగా, దేశంలోకి ప్రవేశించిన తర్వాత ట్రావెలర్ తమ వద్ద ఉన్న జెమ్ స్టోన్స్ లను ప్రకటించడంలో విఫలమయ్యాడని అథారిటీ నిర్ధారించింది. ఇది, ఖతార్ కస్టమ్స్ ప్రకారం, కస్టమ్స్ చట్టాలు, నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందని, ప్రకటించని వస్తువులను చట్టపరమైన విధానాలకు అనుగుణంగా స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ ఖతార్ చట్టాలు, నిబంధనలు , సూచనలను పాటించాలని తన ప్రకటనలో కస్టమ్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







