సింగపూర్ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
- July 29, 2025
సింగపూర్: ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో డేటా సెంటర్ల ఏర్పాటు పై దృష్టి సారించారు. విశాఖపట్నం ఈ రంగానికి అత్యుత్తమ ప్రదేశమని ఆయన తెలిపారు. ఇప్పటికే అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటైందని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ త్వరలోనే విశాఖలో ఏర్పడుతుందని వెల్లడించారు. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా విశాఖలో తమ ప్రాజెక్టులను ప్రారంభించనున్నాయని చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 జనవరి నాటికి అమరావతిలో తొలి క్వాంటం వ్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. పరిశోధనలకు కూడా ఇది పెద్ద మద్దతు ఇస్తుందని అన్నారు.
పారిశ్రామిక అనుకూల పాలసీలు
రాష్ట్రంలో 20కిపైగా పారిశ్రామిక, పెట్టుబడి అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఈ అవకాశాలను వివరించారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు.సీఎం చంద్రబాబు కెప్పెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్ వియ్తో సమావేశమయ్యారు. అమరావతి అభివృద్ధిలో కెప్పెల్ భాగస్వామ్యం, అలాగే విశాఖను గ్రోత్ ఇంజిన్గా మార్చే ప్రణాళికలపై చర్చించారు. ఐటీ, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగాల్లో పెట్టుబడుల కోసం కెప్పెల్ను ఆహ్వానించారు.
జీఐసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం
గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్ (GIC) ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పెట్టుబడుల అవకాశాలు చర్చకు వచ్చాయి. వైద్య, విద్య, పట్టణ ప్రణాళిక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం హామీ ఇచ్చారు.విల్మర్ ఇంటర్నేషనల్ గ్రూప్ హెడ్ రాహుల్ కలేతో సీఎం సమావేశమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎడిబుల్ ఆయిల్స్, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులపై చర్చ జరిగింది. రైతులకు విలువ ఆధారిత మార్కెట్ కల్పించేందుకు విల్మర్ టెక్నాలజీ సహకారం అందించనున్నది.
సింగపూర్ ప్రభుత్వ కీలక ప్రకటన
సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. అమరావతి సహా వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు.ఈ ప్రకటనకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.సింగపూర్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం, టెజరాక్ట్ సంస్థలతో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకుంది. సృజనాత్మక కంటెంట్ తయారీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గూగుల్ సంస్థ సాంకేతిక మద్దతు అందించనుంది.ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులపై పెద్ద స్థాయిలో ఆసక్తి పెరిగింది. విశాఖ, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









