ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలోని ఏ నాయకుడూ చెప్పలేదు: ప్రధాని మోదీ
- July 29, 2025
న్యూ ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఆపాలని ప్రపంచంలోని ఏ నాయకుడూ చెప్పలేదని లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
“పాక్ డీజీఎంఓ కాల్ చేశారు. దాడులు ఆపాలని కోరారు.. భారతదేశ ఉద్దేశాన్ని పాకిస్థాన్ సైన్యానికి స్పష్టంగా తెలియజేశాం. మనం అనుకున్నది 100 శాతం సాధించాం. భారత సైన్యం వెల్లడించిన వాస్తవాలను వదిలేసి, కొందరు పాక్ అసత్య ప్రచారాన్నే ముందుకు తీస కువెళ్తున్నారు.
కాంగ్రెస్ తాము లాభపడాలనే స్వార్థంతో వ్యవహరించింది. భద్రతా బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. ప్రపంచదేశాల నుంచి మనుకు మద్దతు లభించినా, కాంగ్రెస్ మాత్రం మన సైనికుల ధైర్యానికి మద్దతు ఇవ్వలేదు” అని మోదీ అన్నారు.
మే 9న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తనతో ఫోన్లో మాట్లాడారని మోదీ అన్నారు. పాకిస్థాన్ భారీ దాడి చేయనుందని ఆయన చెప్పారని అన్నారని, దీంతో పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని తాను అన్నానని తెలిపారు. అలాగే, పాకిస్థాన్కు ఎవరు సాయం చేసినా తాము చూస్తూ ఊరుకోబోమని అన్నామని చెప్పారు. పాకిస్థాన్కు ఎప్పటికీ గుర్తుండిపోయే సమాధానం ఇచ్చామని అన్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను మట్టుబెడతామని చెప్పామని, కలలో కూడా ఊహించని విధంగా వారిని శిక్షిస్తామని అన్నామని గుర్తుచేశారు. అఖిలపక్ష భేటీలోనూ చర్చించామని అన్నారు. పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని అన్నారు.
తాజా వార్తలు
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం









