ఒమన్లో టీచర్ల కొరత
- July 16, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒమన్లో టీచర్ల కొరత ఉన్నట్లు వెల్లడించింది. 100 మంది స్టూడెంట్స్కి కేవలం ఒకే టీచర్ అందుబాటులో ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. షురా కౌన్సిల్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మదిహా అల్ షైబానితో జరిగిన సమావేశంలో ఓ మెంబర్, స్కూళ్ళలో పరిమితికి మించి విద్యార్థులు ఉంటున్నారనీ, వారికి తగినట్లుగా టీచర్లు లేరనే విషయాన్ని ప్రస్తావించారు. అల్పెన్ క్యాపిటల్స్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ సెక్టార్ రిపోర్ట్ 2016 ప్రకారం 2020 నాటికి 1,115,486 విద్యార్థులు ఉంటారని ఓ అంచనా. 3.6 పెరుగుదలతో 2020 నాటికి 12.6 మిలియన్ల నుంచి 15 మిలియన్లకు విద్యార్థుల సంఖ్య చేరనుందని ఓ అంచనా. ఒమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మిగతా జిసిసి దేశాలతో పోల్చితే ఎక్కువగా విద్యార్థుల్ని కలిగి ఉంటారని నివేదిక వెల్లడిస్తోంది. అయితే విద్యార్థుల పెరుగుదలకు తగ్గట్లుగా టీచర్ల పెరుగుదల కనిపించడంలేదు. ఆ విభాగంలో తగు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు







