మిడ్ డే బ్రేక్ రూల్ పాటించిన 99.8 శాతం కంపెనీలు
- July 16, 2016
మినిస్ట్రీ ఆఫ్ హ్యమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ వివరాల ప్రకారం 99.8 శాతం కంపెనీలు మిడ్ డే బ్రేక్ రూల్ని నిబంధనలకు అనుగుణంగా పాటించినట్లు తెలుస్తుంది. 29,185 కంపెనీలు జులై మధ్యంతరం నాటికి పూర్తిగా ఈ మిడ్ డే బ్రేక్ని పాటించాయనీ, 47 సంస్థలు మాత్రం ఆ రూల్ని అతిక్రమించాయని పేర్కొంది మినిస్ట్రీ. 29,232 తనిఖీల్ని మొత్తం 18 టీమ్లు ఈ కాలంలో నిర్వహించాయి. మిడ్ డే బ్రేక్ రూల్ని పాటించిన సంస్థలను మినిస్ట్రీ అభినందించింది. అలాగే రూల్ని అతిక్రమించిన సంస్థలకు ఒక్కో వర్కర్కిగాను 5,000 దిర్హామ్ల ఫైన్ విధించింది. ఈ ఫైన్ 50,000 దిర్హామ్ల వరకు ఉంటుంది. రోజువారీ పనిదినాలు 8 గంటలకు మించి ఉండకూడదనీ, ఓవర్టైమ్ అలవెన్స్లను కార్మికులకు తప్పనిసరిగా చెల్లించాలని అధికారులు చెప్పారు. బ్యాన్ చేసిన సమయాల్లో కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచెయ్యకూడదని, సంస్థలు ఈ విషయంలో కార్మికులకు సహకరించాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







