దుబాయ్ మెరీనా భవనంలో అగ్నిప్రమాదం.. నివాసితులకు అనుమతి..!!
- August 01, 2025
యూఏఈ: దుబాయ్ మెరీనాలోని ఎత్తైన నివాస టవర్ పై అంతస్తులో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదం, గంటల్లోనే ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు రెండు గంటల అనంతరం మెరీనా సెయిల్ నివాసితులను వారి అపార్ట్మెంట్లలోకి తిరిగి అనుమతించారు.
అగ్ని ప్రమాద హెచ్చరికల శబ్దంతో తెల్లవారుజామున 3.30 గంటలకు మేల్కొన్నట్లు భవనంలో నివసించే సిరియన్ విద్యార్థి వివరించారు. "ఇది ఒక భయానక అనుభవం" అని సిరియన్ విద్యార్థి అన్నారు. కాగా, అగ్నిప్రమాద భవనంలోని బాధిత అద్దెదారులకు బైబ్లోస్ హోటల్ సిబ్బంది సహాయం అందించారు కొంతమంది నివాసితులకు హోటల్ సిబ్బంది ఆశ్రయం కల్పించారు.
జూన్లో దుబాయ్ మెరీనాలోని టైగర్ టవర్లో జరిగిన అగ్నిప్రమాదం 3,820 మంది నివాసితులను ఖాళీ చేయించింది. అగ్నిమాపక సిబ్బంది 67 అంతస్తుల భవనంలో మంటలను ఆర్పడానికి రాత్రంతా శ్రమించారు. ట్రామ్ సేవలు 24 గంటలు నిలిపివేయబడ్డాయి. నివాసితులు తమ వస్తువులను పొందలేకపోయారు. జూలై 17 నాటికి, మెరీనా పినాకిల్ అగ్నిప్రమాదం జరిగిన ఒక నెల తర్వాత కూడా కొందరు అద్దెదారులు కొత్త ఇళ్లను వెతుక్కోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







