దుబాయ్ మెరీనా భవనంలో అగ్నిప్రమాదం.. నివాసితులకు అనుమతి..!!

- August 01, 2025 , by Maagulf
దుబాయ్ మెరీనా భవనంలో అగ్నిప్రమాదం.. నివాసితులకు అనుమతి..!!

యూఏఈ: దుబాయ్ మెరీనాలోని ఎత్తైన నివాస టవర్ పై అంతస్తులో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదం, గంటల్లోనే ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు రెండు గంటల అనంతరం మెరీనా సెయిల్ నివాసితులను వారి అపార్ట్‌మెంట్లలోకి తిరిగి అనుమతించారు.

అగ్ని ప్రమాద హెచ్చరికల శబ్దంతో తెల్లవారుజామున 3.30 గంటలకు మేల్కొన్నట్లు భవనంలో నివసించే సిరియన్ విద్యార్థి వివరించారు. "ఇది ఒక భయానక అనుభవం" అని సిరియన్ విద్యార్థి అన్నారు. కాగా, అగ్నిప్రమాద భవనంలోని బాధిత అద్దెదారులకు బైబ్లోస్ హోటల్ సిబ్బంది సహాయం అందించారు  కొంతమంది నివాసితులకు హోటల్ సిబ్బంది ఆశ్రయం కల్పించారు.

జూన్‌లో దుబాయ్ మెరీనాలోని టైగర్ టవర్‌లో జరిగిన అగ్నిప్రమాదం 3,820 మంది నివాసితులను ఖాళీ చేయించింది.  అగ్నిమాపక సిబ్బంది 67 అంతస్తుల భవనంలో మంటలను ఆర్పడానికి రాత్రంతా శ్రమించారు. ట్రామ్ సేవలు 24 గంటలు నిలిపివేయబడ్డాయి. నివాసితులు తమ వస్తువులను పొందలేకపోయారు.  జూలై 17 నాటికి, మెరీనా పినాకిల్ అగ్నిప్రమాదం జరిగిన ఒక నెల తర్వాత కూడా కొందరు అద్దెదారులు కొత్త ఇళ్లను వెతుక్కోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com