దుబాయ్ మెరీనా భవనంలో అగ్నిప్రమాదం.. నివాసితులకు అనుమతి..!!
- August 01, 2025
యూఏఈ: దుబాయ్ మెరీనాలోని ఎత్తైన నివాస టవర్ పై అంతస్తులో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదం, గంటల్లోనే ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు రెండు గంటల అనంతరం మెరీనా సెయిల్ నివాసితులను వారి అపార్ట్మెంట్లలోకి తిరిగి అనుమతించారు.
అగ్ని ప్రమాద హెచ్చరికల శబ్దంతో తెల్లవారుజామున 3.30 గంటలకు మేల్కొన్నట్లు భవనంలో నివసించే సిరియన్ విద్యార్థి వివరించారు. "ఇది ఒక భయానక అనుభవం" అని సిరియన్ విద్యార్థి అన్నారు. కాగా, అగ్నిప్రమాద భవనంలోని బాధిత అద్దెదారులకు బైబ్లోస్ హోటల్ సిబ్బంది సహాయం అందించారు కొంతమంది నివాసితులకు హోటల్ సిబ్బంది ఆశ్రయం కల్పించారు.
జూన్లో దుబాయ్ మెరీనాలోని టైగర్ టవర్లో జరిగిన అగ్నిప్రమాదం 3,820 మంది నివాసితులను ఖాళీ చేయించింది. అగ్నిమాపక సిబ్బంది 67 అంతస్తుల భవనంలో మంటలను ఆర్పడానికి రాత్రంతా శ్రమించారు. ట్రామ్ సేవలు 24 గంటలు నిలిపివేయబడ్డాయి. నివాసితులు తమ వస్తువులను పొందలేకపోయారు. జూలై 17 నాటికి, మెరీనా పినాకిల్ అగ్నిప్రమాదం జరిగిన ఒక నెల తర్వాత కూడా కొందరు అద్దెదారులు కొత్త ఇళ్లను వెతుక్కోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









