ఒమన్ ఆహార భద్రతకు నాంది.. 90,000MT రా షుగర్ దిగుమతి..!!
- August 03, 2025
సోహార్: ఆహార భద్రత దిశగా ఒమన్ అడుగులు వేసింది. మొదటి చక్కెర శుద్ధి కర్మాగారం 90,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ రా షుగర్ ను దిగుమతి చేసుకుంది. ఇది ఆహార తయారీ కార్యకలాపాలలో విస్తరణకు నాంది పలికిందని, ఇది స్థానిక సరఫరాచైన్ కు మద్దతు ఇస్తుందన్నారు.పారిశ్రామిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త గ్రాడ్యుయేట్లు, స్థానిక సాంకేతిక సిబ్బందికి ఆశాజనక అవకాశాలను అందించడానికి దోహదపడుతుందని చక్కెర శుద్ధి కర్మాగారం డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ నాసర్ బిన్ అలీ అల్ హోస్ని తెలిపారు.
సోహార్ పారిశ్రామిక నౌకాశ్రయంలో 180,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ శుద్ధి కర్మాగారాన్ని నిర్మించారు. మధ్యప్రాచ్యంలో ఇదే మొదటిది అని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏటా ఒక మిలియన్ టన్నుల వరకు షుగర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. ఈ ఉత్పత్తి స్థానిక, ప్రాంతీయ, ఎగుమతి మార్కెట్లకు సేవలు అందిస్తుందన్నారు.
బ్రెజిల్ నుండి మొదటి షిప్మెంట్, మొత్తం 90,000 మెట్రిక్ టన్నులు రాగా, ఆటోమేటెడ్ మొబైల్ క్రేన్లు , హై-స్పీడ్ రవాణా వ్యవస్థలను ఉపయోగించి రిఫైనరీలోకి చేర్చారు. వచ్చే సెప్టెంబర్లో వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి కార్యాకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









