ఎతిహాద్ రైలులో ప్రయాణించిన షేక్ మొహమ్మద్..!!

- August 03, 2025 , by Maagulf
ఎతిహాద్ రైలులో ప్రయాణించిన షేక్ మొహమ్మద్..!!

యూఏఈ: దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ నుండి ఫుజైరాకు ఎతిహాద్ రైలు ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు.ఈ మేరకు ఫోటోలను Xలో షేర్ చేశారు.ఈ జాతీయ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.ఇది దేశవ్యాప్తంగా 11 నగరాలను కవర్ చేస్తుందన్నారు.పశ్చిమాన అల్ సిలా నుండి తూర్పున ఫుజైరా వరకు 200కిలో మీటర్ల వేగంతో వెళ్లగలదు.  వచ్చే ఏడాది నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్టు 2030 నాటికి ఏటా 36 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

ఎతిహాద్ రైలు ద్వారా అనుసంధానించబడిన ముఖ్య నగరాలు:

  • అబుదాబి
  • దుబాయ్
  • షార్జా
  • రస్ అల్ ఖైమా
  • ఫుజైరా
  • అల్ ఐన్
  • రువైస్
  • అల్ మిర్ఫా
  • అల్ ధైద్
  • గ్హువైఫాత్ (సౌదీ అరేబియా సరిహద్దులో)
  • సోహార్ (ఒమన్, హఫీత్ రైలు ప్రాజెక్ట్ ద్వారా)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com