బహ్రెయిన్ లో దంచికొడుతున్న ఎండలు.. అధిక ఉష్ణోగ్రతలు..!!
- August 05, 2025
మనామా: అధిక ఉష్ణోగ్రతలతో బహ్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆగస్టు నెల ప్రారంభం నుంచి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ డైరెక్టరేట్ తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో బహ్రెయిన్ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పగలు మరియు రాత్రి సమయాల్లో వాతావరణం వేడిగా, తేమగా ఉంటుందన్నారు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 43°C నుంచి 45°C మధ్య నమోదవుతాయని, ఇక పీక్ అవర్స్ లో ఉష్ణోగ్రత 50°Cకి చేరుకుంటుందన్నారు.
అప్పుడప్పుడు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని, 5 నుండి 10 నాట్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇండ్లలోనే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







