బహ్రెయిన్ లో దంచికొడుతున్న ఎండలు.. అధిక ఉష్ణోగ్రతలు..!!
- August 05, 2025
మనామా: అధిక ఉష్ణోగ్రతలతో బహ్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆగస్టు నెల ప్రారంభం నుంచి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ డైరెక్టరేట్ తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో బహ్రెయిన్ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పగలు మరియు రాత్రి సమయాల్లో వాతావరణం వేడిగా, తేమగా ఉంటుందన్నారు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 43°C నుంచి 45°C మధ్య నమోదవుతాయని, ఇక పీక్ అవర్స్ లో ఉష్ణోగ్రత 50°Cకి చేరుకుంటుందన్నారు.
అప్పుడప్పుడు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని, 5 నుండి 10 నాట్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇండ్లలోనే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!







