బహ్రెయిన్ లో దంచికొడుతున్న ఎండలు.. అధిక ఉష్ణోగ్రతలు..!!
- August 05, 2025
మనామా: అధిక ఉష్ణోగ్రతలతో బహ్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆగస్టు నెల ప్రారంభం నుంచి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ డైరెక్టరేట్ తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో బహ్రెయిన్ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పగలు మరియు రాత్రి సమయాల్లో వాతావరణం వేడిగా, తేమగా ఉంటుందన్నారు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 43°C నుంచి 45°C మధ్య నమోదవుతాయని, ఇక పీక్ అవర్స్ లో ఉష్ణోగ్రత 50°Cకి చేరుకుంటుందన్నారు.
అప్పుడప్పుడు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని, 5 నుండి 10 నాట్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇండ్లలోనే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







