యూఏఈ వాసులను బయపెట్టిన భూకంపం..!!
- August 06, 2025
యూఏఈః యూఏఈలో స్వల్ప భూకంపం నమోదైంది. భూకంపం వచ్చిందని పలువురు నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. భూకంప తీవ్రంగా తాము స్వల్పంగా అనుభించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఖోర్ ఫక్కన్లో 2 తీవ్రతతో భూకంపం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) తెలిపింది.యూఏఈ కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు ఈ భూకంపం వచ్చింది. అయితే, భూకంపం తీవ్రత స్వల్పంగా ఉందని, దాంతో ఎటువంటి ప్రమాదం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. కాగా, భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.ఈ మేరకు భూకంపం సంభవించిన ప్రదేశం యొక్క ఫోటోను జాతీయ వాతావరణ కేంద్రం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







