ఒమన్ లో కీలక వాటర్ నెట్వర్క్ ప్రాజెక్టులు పూర్తి..!!
- August 08, 2025
అల్-ముధైబి: ఉత్తర అషర్కియా గవర్నరేట్లో కీలమైన వాటర్ నెట్ వర్క ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసుకుంటోంది. అల్ ముధైబిలోని వాడి అండమ్ గ్రామాలలో నామా వాటర్ సర్వీసెస్ ద్వారా అమలవుతున్న ఈ వాటర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ను RO 3,668,000 తో నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు దాదాపు 93 శాతం దాటాయని తెలిపారు.
వాడి అండమ్ వాటర్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో భాగంగా అల్-హబాత్ గ్రామంలో ఉన్న ఖద్రా బని దఫా పంపింగ్ స్టేషన్ విస్తరణ పనులతోపాటు 90 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో మూడు కొత్త ఫైబర్గ్లాస్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. వీటితోపాటు అల్-వాషల్, అల్-ఫులైజ్ గ్రామాలలో రెండు బూస్టర్ పంపింగ్ స్టేషన్లు రానున్నాయి. దాదాపు 102 కిలోమీటర్లు మేర ఉండే పైప్ లైన్ ద్వారా వాడి అండమ్ లోని తొమ్మిది గ్రామాలలో మంచినీటి అవసరాలను తీర్చుతుందని పేర్కొన్నారు.
రెండవ దశను RO 15,132,000 తో 2027 నాటికి పూర్తి చేయనున్నారు. ఇందులో 40 కి.మీ ట్రాన్స్మిషన్ పైప్లైన్, 217 కి.మీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, 4,065 గృహ కనెక్షన్లు, పంపింగ్ స్టేషన్ మరియు ఎలివేటెడ్ ట్యాంక్ ఉన్నాయి. మరోవైపు అల్-తయీన్ విలాయత్లలో వాటర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని గమనించాలి. 36 నెలల ప్రాజెక్టులో అల్-ముధైబీలోని అల్-జర్దా, దమాలోని మహ్లా మరియు అల్-తయీన్ మధ్య 77.85 కి.మీ నీటి ప్రసార పైప్లైన్, 3 వేల నుండి 10 వేల క్యూబిక్ మీటర్ల మధ్య నిల్వ సామర్థ్యం కలిగిన ఏడు పంపిణీ ట్యాంకులు, అల్-జర్దా మరియు అల్-రహ్బా ప్రాంతాలలో రెండు పంపింగ్ స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









