కువైట్ లో మాదక ద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాబడితే భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోదు

- July 17, 2016 , by Maagulf
కువైట్ లో మాదక ద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాబడితే  భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోదు

  

కువైట్ లోపల ఉన్న భారతీయులలో కొందరు  డ్రగ్స్ / నార్కోటిక్స్ పదార్థాలు తీసుకొచ్చినట్లు  ఆరోపణలు వెల్లువెత్తడంపై  భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. కువైట్ లో  పెద్ద సంఖ్యలో  భారత జాతీయులు అరెస్టు కాబడినట్లు వార్తలు ఊపందుకున్నాయి. అలాగే,  మాదక ద్రవ్యాల సంబంధిత కేసుల సందర్భాలలో కువైట్ లో  అరెస్టు కాబడుతున్న  భారత జాతీయులు సంఖ్య పెరుగుదల గణనీయంగా  ఉంది. మొత్తం 65 శాతం మంది భారత ఖైదీలు మాదక ద్రవ్యాల  సంబంధిత నేరాలు కారణంగా సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇంకా, పబ్లిక్ జైలులో నిర్బంధంలో40 శాతం మంది భారతీయులు మాదకద్రవ్యాల సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కువైట్ లో కనుక మాదక ద్రవ్యాలు ఒక చిన్న మొత్తంలో ఉపయోగించడం  మరియు డ్రగ్గులు రవాణా, సరఫరా చేసి దొరికినట్లయితే  జరిమానాలు విధించబడటం  అరెస్టు చేయబడి ఖైదు లో ఉంచడానికి  దారితీస్తుందనే  దోషిగా నేరస్థులు నిరూపితమైతే  స్థానిక కోర్టులు ద్వారా మరణశిక్షకు లేదా జీవిత ఖైదులు  విధించబడతాయి. అంతేకాక, మాదకద్రవ్యాల సంబంధిత సందర్భాలలో, భారత ఎంబసీ అరెస్టు కాబడిన వారికి  ఏ చట్టపరమైన / ఆర్థిక సాయం చేసే వీలు లేదని తేల్చి చెప్పింది.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com