కువైట్ లో టెలికాం టవర్లు, బ్యాంకులే లక్ష్యంగా సైబర్ అటాక్స్..!!
- August 11, 2025
కువైట్ః కువైట్ లో భారీ సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్న ముఠా నెట్ వర్క్ ను అధికారులు ఛేదించారు. టెలికాం టవర్లు, బ్యాంకులపై దాడులకు పాల్పడిన ఆఫ్రికన్ జాతీయతకు చెందిన అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాను అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైబర్ క్రైమ్ ముఠా నెట్వర్క్లను హ్యాక్ చేయడానికి మరియు బ్యాంక్ అకౌంట్ల నుంచి నిధులను దొంగిలించడానికి బ్యాంకు సిబ్బంది పేరిట ఫేక్ మెసేజులు, కాల్స్ చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇందు కోసం ముఠా అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. రైడ్స్ సందర్భంగా వాటిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు, సాల్మియాలో ఒక వాహనం నుండి అనుమానాస్పద సంకేతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించి, అనేక కార్లను ఢీకొట్టాడు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









