కువైట్ లో టెలికాం టవర్లు, బ్యాంకులే లక్ష్యంగా సైబర్ అటాక్స్..!!
- August 11, 2025
కువైట్ః కువైట్ లో భారీ సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్న ముఠా నెట్ వర్క్ ను అధికారులు ఛేదించారు. టెలికాం టవర్లు, బ్యాంకులపై దాడులకు పాల్పడిన ఆఫ్రికన్ జాతీయతకు చెందిన అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాను అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైబర్ క్రైమ్ ముఠా నెట్వర్క్లను హ్యాక్ చేయడానికి మరియు బ్యాంక్ అకౌంట్ల నుంచి నిధులను దొంగిలించడానికి బ్యాంకు సిబ్బంది పేరిట ఫేక్ మెసేజులు, కాల్స్ చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇందు కోసం ముఠా అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. రైడ్స్ సందర్భంగా వాటిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు, సాల్మియాలో ఒక వాహనం నుండి అనుమానాస్పద సంకేతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించి, అనేక కార్లను ఢీకొట్టాడు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!









