బహ్రెయిన్ లో 130 మందిపై బహిష్కరణ వేటు..!!
- August 11, 2025
మనామా: బహ్రెయిన్ లో ఆగస్టు 3 మరియు 9వ తేదీల మధ్య 1,089 తనిఖీలను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 130 మందిని గుర్తించి వారిని బహ్రెయిన్ నుంచి బహిష్కరించినట్లు తెలిపింది.
అన్ని గవర్నరేట్లలోని వివిధ దుకాణాలలో 1,076 తనిఖీలు నిర్వహించగా, వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో 13 సంయుక్త తనిఖీలు జరిగాయని తెలిపింది. క్యాపిటల్ గవర్నరేట్లో ఒకటి, ముహారక్లో మూడు, నార్తర్న్ గవర్నరేట్లో నాలుగు మరియు సదరన్ గవర్నరేట్లో ఐదు చొప్పున సంయుక్త క్యాంపెయిన్ లను నిర్వహించినట్టు పేర్కొంది.
చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులకు వ్యతిరేకంగా తమ ప్రయాత్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఏదైనా సమాచారాన్ని వెబ్సైట్, హాట్లైన్ నెంబర్ 17506055 కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!









