బహ్రెయిన్ లో 130 మందిపై బహిష్కరణ వేటు..!!
- August 11, 2025
మనామా: బహ్రెయిన్ లో ఆగస్టు 3 మరియు 9వ తేదీల మధ్య 1,089 తనిఖీలను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 130 మందిని గుర్తించి వారిని బహ్రెయిన్ నుంచి బహిష్కరించినట్లు తెలిపింది.
అన్ని గవర్నరేట్లలోని వివిధ దుకాణాలలో 1,076 తనిఖీలు నిర్వహించగా, వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో 13 సంయుక్త తనిఖీలు జరిగాయని తెలిపింది. క్యాపిటల్ గవర్నరేట్లో ఒకటి, ముహారక్లో మూడు, నార్తర్న్ గవర్నరేట్లో నాలుగు మరియు సదరన్ గవర్నరేట్లో ఐదు చొప్పున సంయుక్త క్యాంపెయిన్ లను నిర్వహించినట్టు పేర్కొంది.
చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులకు వ్యతిరేకంగా తమ ప్రయాత్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఏదైనా సమాచారాన్ని వెబ్సైట్, హాట్లైన్ నెంబర్ 17506055 కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







