ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- November 28, 2025
మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజక వర్గాలలో వైద్య సహాయం నిమిత్తం ఎంపి బాలశౌరి సిఫారసు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం నుండి నిధులు మంజూరు చేస్తూ వచ్చిన చెక్కులను సంబందిత వ్యక్తులకు మచిలీపట్నం లోని ఎంపి గారి క్యాంపు కార్యాలయంలో రోజు పంపిణి చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులను పొందిన వారిలో మచిలీపట్నంలోని పరాసుపేటకు చెందిన కమ్మిలి నాగ శ్రీదేవికి రూ.1,31,952/-, మచిలీపట్నం లోని వాడపాలెం కు చెందిన బండి లక్ష్మి కి రూ.65,141/-, మచిలిపట్నంలోని మేకవానిపాలెం కు చెందిన శ్రీ వాలి శ్రీనివాసరావుకి రు. 21,986/-, మొవ్వ మండలంలోని కూచిపూడి కి చెందిన శ్రీ పోరంకి రాజ కుమార్కి రూ.35,348/-, మచిలీపట్నంలోని చిలకలపూడి కు చెందిన సూరిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరికి రూ.39,595/-, పెడన మండలంలోని పెడన కు చెందిన సిరాపు నాగలక్ష్మి కి రూ.20,000/- పెడన మండలంలోని పెడనకు చెందిన అమృత దుర్గ గారికి 20,000/-, మచిలీపట్నం లోని సర్కిల్ పేటకు చెందిన గుండు బాల వెంకట మురళీధర్ కి 95,837/- వెరశి పైన పేర్కొన్న ఎనిమిది మందికి గాను రూ.4,29,859/- విలువైన చెక్కులను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా అందించడం జరిగింది.
అవసరమైన సమయంలో వైద్యం నిమిత్తం సహాయం చేసినందుకు లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,ఆర్ధిక సహాయం మంజూరు నిమిత్తం సిఫారసు చేసిన ఎంపి బాలశౌరికి తమ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!







