ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- November 28, 2025
మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజక వర్గాలలో వైద్య సహాయం నిమిత్తం ఎంపి బాలశౌరి సిఫారసు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం నుండి నిధులు మంజూరు చేస్తూ వచ్చిన చెక్కులను సంబందిత వ్యక్తులకు మచిలీపట్నం లోని ఎంపి గారి క్యాంపు కార్యాలయంలో రోజు పంపిణి చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులను పొందిన వారిలో మచిలీపట్నంలోని పరాసుపేటకు చెందిన కమ్మిలి నాగ శ్రీదేవికి రూ.1,31,952/-, మచిలీపట్నం లోని వాడపాలెం కు చెందిన బండి లక్ష్మి కి రూ.65,141/-, మచిలిపట్నంలోని మేకవానిపాలెం కు చెందిన శ్రీ వాలి శ్రీనివాసరావుకి రు. 21,986/-, మొవ్వ మండలంలోని కూచిపూడి కి చెందిన శ్రీ పోరంకి రాజ కుమార్కి రూ.35,348/-, మచిలీపట్నంలోని చిలకలపూడి కు చెందిన సూరిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరికి రూ.39,595/-, పెడన మండలంలోని పెడన కు చెందిన సిరాపు నాగలక్ష్మి కి రూ.20,000/- పెడన మండలంలోని పెడనకు చెందిన అమృత దుర్గ గారికి 20,000/-, మచిలీపట్నం లోని సర్కిల్ పేటకు చెందిన గుండు బాల వెంకట మురళీధర్ కి 95,837/- వెరశి పైన పేర్కొన్న ఎనిమిది మందికి గాను రూ.4,29,859/- విలువైన చెక్కులను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా అందించడం జరిగింది.
అవసరమైన సమయంలో వైద్యం నిమిత్తం సహాయం చేసినందుకు లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,ఆర్ధిక సహాయం మంజూరు నిమిత్తం సిఫారసు చేసిన ఎంపి బాలశౌరికి తమ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







