ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం...
- August 11, 2025
న్యూ ఢిల్లీ: ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుండి ఢిల్లీ–వాషింగ్టన్ డీసీ నాన్స్టాప్ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం 26 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలకు విస్తృత రిట్రోఫిటింగ్ పనులు (టెక్నికల్ సదుపాయాలు అప్గ్రేడ్ చేయడం) జరుగుతున్నాయి. దీని వలన తాత్కాలికంగా విమానాల కొరత ఏర్పడిందని, అందువల్ల ఈ రూట్ను నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
అదనంగా, పాకిస్థాన్ గగనతలం మూసివేత కొనసాగుతుండటంతో, సుదూర అంతర్జాతీయ ప్రయాణాల షెడ్యూల్లో మార్పులు తప్పనిసరి అయ్యాయని తెలిపింది.
ఈ రిట్రోఫిటింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రయాణికుల సౌకర్యాన్ని, అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యం అని ఎయిర్ ఇండియా చెబుతోంది. అయితే, ఈ పనుల కారణంగా 2026 చివరి వరకు కొన్ని విమానాలు ఎప్పుడైనా అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది.
సెప్టెంబర్ 1 తర్వాత ఢిల్లీ–వాషింగ్టన్ మార్గంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి, రీబుకింగ్ లేదా పూర్తి రీఫండ్ ఆప్షన్లు అందిస్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ప్రయాణికుల ఆర్థిక, సమయ సౌకర్యాలకు అనుగుణంగా ఇతర విమాన మార్గాలను సూచిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









