బహ్రెయిన్లో మేకప్ డ్రగ్ పార్శిల్ కేసు.. నిందితుడికి 15ఏళ్ల జైలుశిక్ష..!!
- August 13, 2025
మనామా: బహ్రెయిన్ లో భారీ డ్రగ్ నెట్ వర్క్ బయటపడింది. ఒక ప్రసిద్ధ కంపెనీలో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్న ఒక ఆసియా వ్యక్తి అమెరికా నుండి మేకప్ షిప్మెంట్లో దాచిపెట్టిన గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, 5,000 దినార్ల జరిమానా విధించింది. జైలు శిక్ష పూర్తియిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
పోస్టల్ షిప్మెంట్ల ద్వారా డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇంటర్నేషనల్ నెట్వర్క్లో అతను భాగమని దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 5న బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో పార్శిల్ను సీజ్ చేశారు. అందులో మేకప్ వస్తువల మాటున దాచిన 1.016 కిలోల బరువున్న మూడు బ్యాగుల గంజాయిని గుర్తించారు. ఈ పార్శిల్ ను తీసుకునేందుకు వచ్చిన క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









