బహ్రెయిన్లో మేకప్ డ్రగ్ పార్శిల్ కేసు.. నిందితుడికి 15ఏళ్ల జైలుశిక్ష..!!
- August 13, 2025
మనామా: బహ్రెయిన్ లో భారీ డ్రగ్ నెట్ వర్క్ బయటపడింది. ఒక ప్రసిద్ధ కంపెనీలో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్న ఒక ఆసియా వ్యక్తి అమెరికా నుండి మేకప్ షిప్మెంట్లో దాచిపెట్టిన గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, 5,000 దినార్ల జరిమానా విధించింది. జైలు శిక్ష పూర్తియిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
పోస్టల్ షిప్మెంట్ల ద్వారా డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇంటర్నేషనల్ నెట్వర్క్లో అతను భాగమని దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 5న బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో పార్శిల్ను సీజ్ చేశారు. అందులో మేకప్ వస్తువల మాటున దాచిన 1.016 కిలోల బరువున్న మూడు బ్యాగుల గంజాయిని గుర్తించారు. ఈ పార్శిల్ ను తీసుకునేందుకు వచ్చిన క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







