బహ్రెయిన్లో మేకప్ డ్రగ్ పార్శిల్ కేసు.. నిందితుడికి 15ఏళ్ల జైలుశిక్ష..!!
- August 13, 2025
మనామా: బహ్రెయిన్ లో భారీ డ్రగ్ నెట్ వర్క్ బయటపడింది. ఒక ప్రసిద్ధ కంపెనీలో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్న ఒక ఆసియా వ్యక్తి అమెరికా నుండి మేకప్ షిప్మెంట్లో దాచిపెట్టిన గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, 5,000 దినార్ల జరిమానా విధించింది. జైలు శిక్ష పూర్తియిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
పోస్టల్ షిప్మెంట్ల ద్వారా డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇంటర్నేషనల్ నెట్వర్క్లో అతను భాగమని దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 5న బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో పార్శిల్ను సీజ్ చేశారు. అందులో మేకప్ వస్తువల మాటున దాచిన 1.016 కిలోల బరువున్న మూడు బ్యాగుల గంజాయిని గుర్తించారు. ఈ పార్శిల్ ను తీసుకునేందుకు వచ్చిన క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







