బిగ్ టికెట్.. ఏపీ వాసిని వరించిన Dh150,000..!!
- August 13, 2025
యూఏఈ: బిగ్ టికెట్ ది బిగ్ విన్ కాంటెస్ట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 42 ఏళ్ల మొబైల్ షాప్ యజమాని అస్లాం షేక్ ను అధృష్టం వరించింది. అతను 150,000 దిర్హనును గెలుపొందాడు. 2007 నుండి తన కుటుంబంతో కువైట్లో నివసిస్తున్నాడు షేక్. ఆరు నెలల క్రితమే తన స్నేహితుల ద్వారా బిగ్ టికెట్ గురించి తెలిసినట్లు తెలిపాడు. తాను నిజంగా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ఏడుగురు స్నేహితుల బృందంలో భాగంగా క్రమం తప్పకుండా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లు, గ్రూప్ సభ్యులతో బహుమతిని సమానంగా పంచుకుంటానని తెలిపాడు.
షేక్ తోపాటు మొత్తం నలుగురు వ్యక్తులు 510,000 దిర్హంలను గెలుపొందారు. వారిలో కేరళకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి స్మిరేష్ అతిక్కున్ను పరంబిల్ కుంచన్ Dh120,000 గెలుచుకున్నారు. అల్యూమినియం ఫ్యాబ్రికేషన్లో పనిచేస్తున్న అతడు, గత 17 సంవత్సరాలుగా అల్ ఐన్లో నివసిస్తున్నాడు. ఆరు నెలల క్రితం, అతను 16 మంది స్నేహితుల బృందంతో కలిసి టిక్కెట్లు కొనడం ప్రారంభించినట్లు తెలిపాడు. బహుమతిలో తనకు దక్కే వాటాతో కుటుంబాన్ని పోషించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. వీరితోపాటు మరో భారతీయ ప్రవాసుడు ఫిరోజ్ ఖాన్ ఆన్లైన్ టికెట్తో Dh140,000 గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!