ఖతార్ లో మెట్రో ప్రయాణీకులకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- August 13, 2025
దోహా: దోహా మెట్రోను ఉపయోగించే ప్రయాణికులందరు సేఫ్టీ గైడ్ లైన్స్ పాటించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ జారీ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఓ ప్రకటన జారీ చేసింది. వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా క్యారీ చేయాలని, రైల్ డోర్స్ ఆటోమెటిక్ గా పనిచేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించింది. స్టేషన్లలో ప్రకటించే అన్ని సూచనలను పాటించాలని తెలిపింది.
ఇక అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయాన్ని కోరాలని, స్టేషన్లలో స్మోకింగ్ చేయవద్దని, ఎస్కలేటర్లను ఉపయోగించేటప్పుడు పిల్లల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలా సేఫ్టీ గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని, సురక్షిత ప్రయాణాన్ని ఆస్వాదించాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









