ఒమన్ ఖరీఫ్ ధోఫర్ సూపర్ సక్సెస్..పోటెత్తిన టూరిస్టులు..!!
- August 13, 2025
సలాలా: ఒమన్ లోని ఖరీఫ్ ధోపర్ కు పర్యాటకులు పోటెత్తారు. 21 జూన్ నుండి 31 జూలై వరకు ఖరీఫ్ ధోఫర్ సీజన్ను సందర్శించిన వారి సఖ్య సుమారు 442,100 కు చేరుకుంది, గతేడాది కంటే 7 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాథమిక అంచనాలను వివరించారు.
ఒమానీ సందర్శకుల సంఖ్య 75.6 శాతానికి పెరిగి 334,399 కు చేరుకుంది. అదే సమయంలో GCC దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 69,801 కాగా, ఇతర దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 37,900గా ఉంది.
జూలై చివరి నాటికి మొత్తం 334,846 మంది సందర్శకులు ధోఫర్ గవర్నరేట్కు తరలివచ్చారు. జూలై చివరి నాటికి ఖరీఫ్ ధోఫర్ సీజన్కు వచ్చిన సందర్శకులలో 95.3% మంది జూలై 1 నుంచి జూలై 31 మధ్య వచ్చారని, 4.7% మంది 21 జూన్ 2025 మరియు 30 జూన్ 2025 మధ్య వచ్చారని గమనించాలి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









