ఒమన్ ఖరీఫ్ ధోఫర్ సూపర్ సక్సెస్..పోటెత్తిన టూరిస్టులు..!!
- August 13, 2025
సలాలా: ఒమన్ లోని ఖరీఫ్ ధోపర్ కు పర్యాటకులు పోటెత్తారు. 21 జూన్ నుండి 31 జూలై వరకు ఖరీఫ్ ధోఫర్ సీజన్ను సందర్శించిన వారి సఖ్య సుమారు 442,100 కు చేరుకుంది, గతేడాది కంటే 7 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాథమిక అంచనాలను వివరించారు.
ఒమానీ సందర్శకుల సంఖ్య 75.6 శాతానికి పెరిగి 334,399 కు చేరుకుంది. అదే సమయంలో GCC దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 69,801 కాగా, ఇతర దేశాల నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 37,900గా ఉంది.
జూలై చివరి నాటికి మొత్తం 334,846 మంది సందర్శకులు ధోఫర్ గవర్నరేట్కు తరలివచ్చారు. జూలై చివరి నాటికి ఖరీఫ్ ధోఫర్ సీజన్కు వచ్చిన సందర్శకులలో 95.3% మంది జూలై 1 నుంచి జూలై 31 మధ్య వచ్చారని, 4.7% మంది 21 జూన్ 2025 మరియు 30 జూన్ 2025 మధ్య వచ్చారని గమనించాలి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







