సౌదీ అరేబియాలో 30 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టు..!!
- August 13, 2025
రియాద్: అనధికారంగా సౌదీఅరేబియాలోకి వచ్చిన యాత్రికులకు హజ్ యాత్రకు సంబంధించి సౌకర్యాలు కల్పించినందుకు మొత్తం 30 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు. మేరకు సౌదీ ఓవర్సైట్ మరియు అవినీతి నిరోధక అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఒక కేసులో మాత్రమే నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని నజహా ప్రతినిధి తెలిపారు.
ఒక మాజీ యూనివర్సిటీ ఉద్యోగి తన పదవీకాలంలో యూనివర్సిటీ అకౌంట్ నుండి SR100,800 ను దుర్వినియోగం చేసినందుకు అరెస్టు చేశారు. మరొక కేసులో గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లలో పనిచేస్తున్న నాన్-కమిషన్డ్ అధికారి లంచాలు తీసుకొని తాత్కాలిక పని వీసాలను పొడిగించినట్లు గుర్తించి , అరెస్ట్ చేశామని తెలిపింది.
గతంలో నమోదైన మున్సిపల్ ఉల్లంఘనలను రద్దు చేసేందుకు ఒక మేయర్టీ ఉద్యోగిని అరెస్టు చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్లో పనిచేస్తున్న నాన్-కమిషన్డ్ అధికారి, తన సివిల్ డిఫెన్స్ లైసెన్స్ను పునరుద్ధరించినందుకు బదులుగా స్టోర్ ఉద్యోగి నుండి డబ్బును అందుకుంటుండగా అరెస్టు చేశారు.
గవర్నరేట్లోని మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఒక పౌరుడు టైటిల్ డీడ్ లేకుండా ఆస్తి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి, విద్యుత్ కనెక్షన్ను అందిస్తామని హామీ ఇచ్చి.. బదులుగా SR17,000 మొత్తాన్ని తీసుకుంటుండగా అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









