సౌదీ అరేబియాలో 30 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టు..!!
- August 13, 2025
రియాద్: అనధికారంగా సౌదీఅరేబియాలోకి వచ్చిన యాత్రికులకు హజ్ యాత్రకు సంబంధించి సౌకర్యాలు కల్పించినందుకు మొత్తం 30 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు. మేరకు సౌదీ ఓవర్సైట్ మరియు అవినీతి నిరోధక అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఒక కేసులో మాత్రమే నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని నజహా ప్రతినిధి తెలిపారు.
ఒక మాజీ యూనివర్సిటీ ఉద్యోగి తన పదవీకాలంలో యూనివర్సిటీ అకౌంట్ నుండి SR100,800 ను దుర్వినియోగం చేసినందుకు అరెస్టు చేశారు. మరొక కేసులో గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లలో పనిచేస్తున్న నాన్-కమిషన్డ్ అధికారి లంచాలు తీసుకొని తాత్కాలిక పని వీసాలను పొడిగించినట్లు గుర్తించి , అరెస్ట్ చేశామని తెలిపింది.
గతంలో నమోదైన మున్సిపల్ ఉల్లంఘనలను రద్దు చేసేందుకు ఒక మేయర్టీ ఉద్యోగిని అరెస్టు చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్లో పనిచేస్తున్న నాన్-కమిషన్డ్ అధికారి, తన సివిల్ డిఫెన్స్ లైసెన్స్ను పునరుద్ధరించినందుకు బదులుగా స్టోర్ ఉద్యోగి నుండి డబ్బును అందుకుంటుండగా అరెస్టు చేశారు.
గవర్నరేట్లోని మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఒక పౌరుడు టైటిల్ డీడ్ లేకుండా ఆస్తి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి, విద్యుత్ కనెక్షన్ను అందిస్తామని హామీ ఇచ్చి.. బదులుగా SR17,000 మొత్తాన్ని తీసుకుంటుండగా అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







