దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త
- August 15, 2025
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్తను చెప్పారు. ప్రజలకు జీఎస్టీ తగ్గించనున్నట్లు చెప్పారు.దీపావళి లోపు తదుపరి జనరేషన్ జీఎస్టీ అమలులోకి తీసుకొస్తామని మోదీ తెలిపారు. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని, దీపావళికి ప్రజలకు డబుల్ బొనాంజా ఇస్తాం అని మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ దేశ సైనికులకు తన అభినందనలు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ యుద్ధ సమయంలో మనదేశ సైనికులు తమ ప్రాణాలను తెగించి, పాకిస్తాన్ పై యుద్ధం చేశారని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం అనేకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాగే సైనికులు కూడా దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేశారని మోదీ గుర్తు చేసుకున్నారు. వారి కష్టార్జితం వల్లే మనం శాంతియుతంగా జీవించగలుగుతున్నామని మోదీ సైనికులను ప్రశంసలతో అభినందించారు.ఢిల్లీలోని ఎర్రలోటలో మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









