దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త
- August 15, 2025
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్తను చెప్పారు. ప్రజలకు జీఎస్టీ తగ్గించనున్నట్లు చెప్పారు.దీపావళి లోపు తదుపరి జనరేషన్ జీఎస్టీ అమలులోకి తీసుకొస్తామని మోదీ తెలిపారు. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని, దీపావళికి ప్రజలకు డబుల్ బొనాంజా ఇస్తాం అని మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ దేశ సైనికులకు తన అభినందనలు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ యుద్ధ సమయంలో మనదేశ సైనికులు తమ ప్రాణాలను తెగించి, పాకిస్తాన్ పై యుద్ధం చేశారని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం అనేకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాగే సైనికులు కూడా దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేశారని మోదీ గుర్తు చేసుకున్నారు. వారి కష్టార్జితం వల్లే మనం శాంతియుతంగా జీవించగలుగుతున్నామని మోదీ సైనికులను ప్రశంసలతో అభినందించారు.ఢిల్లీలోని ఎర్రలోటలో మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









