దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త
- August 15, 2025
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్తను చెప్పారు. ప్రజలకు జీఎస్టీ తగ్గించనున్నట్లు చెప్పారు.దీపావళి లోపు తదుపరి జనరేషన్ జీఎస్టీ అమలులోకి తీసుకొస్తామని మోదీ తెలిపారు. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని, దీపావళికి ప్రజలకు డబుల్ బొనాంజా ఇస్తాం అని మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ దేశ సైనికులకు తన అభినందనలు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ యుద్ధ సమయంలో మనదేశ సైనికులు తమ ప్రాణాలను తెగించి, పాకిస్తాన్ పై యుద్ధం చేశారని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం అనేకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాగే సైనికులు కూడా దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేశారని మోదీ గుర్తు చేసుకున్నారు. వారి కష్టార్జితం వల్లే మనం శాంతియుతంగా జీవించగలుగుతున్నామని మోదీ సైనికులను ప్రశంసలతో అభినందించారు.ఢిల్లీలోని ఎర్రలోటలో మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







