ఏడాది ముందుగానే ఎమిరాటీ పాస్పోర్టుల పునరుద్ధరణ..!!
- August 15, 2025
యూఏఈ: యూఏఈ పౌరులు ఇప్పుడు తమ పాస్పోర్టులను ఒక ఏడాది ముందుగానే పునరుద్ధరించుకోవచ్చు. ఆగస్టు 18నుండి 12 నెలలు లేదా అంతకంటే తక్కువ చెల్లుబాటు కాలం ఉన్న పాస్పోర్ట్లు ఉన్న పౌరులు స్మార్ట్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ ద్వారా పునరుద్ధరించుకోవచ్చని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ ప్రకటించింది.
ఎమిరాటీ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత బలమైన పాస్పోర్ట్లలో ఒకటిగా ఉందని, ఈ నిర్ణయం దాని ప్రపంచ స్థాయిని మరింత పెంచుతుందని, పాస్పోర్ట్ జారీ మరియు పునరుద్ధరణ ప్రక్రియను ఈ ప్రాంతానికి ఒక నమూనాగా మారుస్తుందని ఫెడరల్ అథారిటీ తెలిపింది.
హెన్లీ & పార్టనర్స్ ప్రకారం, 2025లో యూఏఈ పాస్పోర్ట్ ప్రపంచంలోని 10 బలమైన పాస్పోర్ట్లలో ఒకటిగా నిలిచింది. 184 దేశాలకు వీసా-రహిత యాక్సెస్ మరియు వీసా-ఆన్-అరైవల్ను అందిస్తోంది. 21 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులకు ఎమిరాటీ పాస్పోర్ట్ల చెల్లుబాటు వ్యవధిని 10 సంవత్సరాలకు పొడిగించారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









