కువైట్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!

- August 16, 2025 , by Maagulf
కువైట్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!

కువైట్: కువైట్ లో భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో  జరుపుకున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు.  భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.  
భారత్-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో.. భారతీయ సమాజం పట్ల వారి నిరంతర మద్దతు కోసం కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా కువైట్‌లోని అనేకమంది భారతీయ రెస్టారెంట్ల సహకారంతో హాజరైన వారికి అల్పాహారం అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com