లైసెన్స్ లేని విద్యా కేంద్రాల నిర్వహణ..ఆరుగురికి జరిమానాలు..!!
- August 16, 2025
మనామా: లైసెన్స్ లేని విద్యా సేవలను నడిపినందుకు ఆరుగురికి BD1,000 మరియు BD2,000 మధ్య జరిమానా విధించినట్లు లోయర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చిందని బహ్రెయిన్ విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫీల్డ్ బృందాలు బహ్రెయిన్ అంతటా ప్రైవేట్ సంస్థలను సందర్శించిన తర్వాత ఈ కేసు నమోదైంది. మంత్రిత్వ శాఖ లైసెన్స్లు లేకుండా తరగతులు నడుపుతున్న ఆరు కేంద్రాలను ఇన్స్పెక్టర్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.
ఈ కేంద్రాలు మూడు నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. కొన్ని క్లాసులో 60 మందికిపైగా విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆయా సంస్థలు కిండర్ గార్టెన్లకు అవసరమైన భద్రతా నియమాలను పాటించడంలేదని, అందుకే వాటిపై కేసులు నమోదుచేసి, జరిమానాలు విధించినట్టు ఇన్స్పెక్టర్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







