లైసెన్స్ లేని విద్యా కేంద్రాల నిర్వహణ..ఆరుగురికి జరిమానాలు..!!
- August 16, 2025
మనామా: లైసెన్స్ లేని విద్యా సేవలను నడిపినందుకు ఆరుగురికి BD1,000 మరియు BD2,000 మధ్య జరిమానా విధించినట్లు లోయర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చిందని బహ్రెయిన్ విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫీల్డ్ బృందాలు బహ్రెయిన్ అంతటా ప్రైవేట్ సంస్థలను సందర్శించిన తర్వాత ఈ కేసు నమోదైంది. మంత్రిత్వ శాఖ లైసెన్స్లు లేకుండా తరగతులు నడుపుతున్న ఆరు కేంద్రాలను ఇన్స్పెక్టర్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.
ఈ కేంద్రాలు మూడు నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. కొన్ని క్లాసులో 60 మందికిపైగా విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆయా సంస్థలు కిండర్ గార్టెన్లకు అవసరమైన భద్రతా నియమాలను పాటించడంలేదని, అందుకే వాటిపై కేసులు నమోదుచేసి, జరిమానాలు విధించినట్టు ఇన్స్పెక్టర్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!









