లైసెన్స్ లేని విద్యా కేంద్రాల నిర్వహణ..ఆరుగురికి జరిమానాలు..!!
- August 16, 2025
మనామా: లైసెన్స్ లేని విద్యా సేవలను నడిపినందుకు ఆరుగురికి BD1,000 మరియు BD2,000 మధ్య జరిమానా విధించినట్లు లోయర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చిందని బహ్రెయిన్ విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫీల్డ్ బృందాలు బహ్రెయిన్ అంతటా ప్రైవేట్ సంస్థలను సందర్శించిన తర్వాత ఈ కేసు నమోదైంది. మంత్రిత్వ శాఖ లైసెన్స్లు లేకుండా తరగతులు నడుపుతున్న ఆరు కేంద్రాలను ఇన్స్పెక్టర్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.
ఈ కేంద్రాలు మూడు నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. కొన్ని క్లాసులో 60 మందికిపైగా విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆయా సంస్థలు కిండర్ గార్టెన్లకు అవసరమైన భద్రతా నియమాలను పాటించడంలేదని, అందుకే వాటిపై కేసులు నమోదుచేసి, జరిమానాలు విధించినట్టు ఇన్స్పెక్టర్లు తెలిపారు.
తాజా వార్తలు
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!









