ఒమన్ తీరంలో నలుగురిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!

- August 16, 2025 , by Maagulf
ఒమన్ తీరంలో నలుగురిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!

మస్కట్: ఒమన్ లోని దైమానియాత్ దీవుల సమీపంలో పడవ బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కోస్ట్ గార్డ్ ముగ్గురు పౌరులను విజయవంతంగా రక్షించింది. అయితే, పడవ బోల్తా పడటానికి బలమైన అలలతోపాటు బలమైన గాలులు కారణమని అధికారులు తెలిపారు.

కాగా, ప్రమాద సమయంలో పడవలో ఉన్న నాలుగో వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు.  కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ సెంటర్ కు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలో వేగంగా పాల్గొనడంతో బాధితులను సురక్షితంగా రక్షించినట్లు ఒక ప్రకటనలో కోస్ట్ గార్డ్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com