సహజీవనం మహిళలకి క్షేమం కాదు: కంగనా
- August 16, 2025
బాలీవుడ్ నటి, ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ తన మాటలతో సంచలనం రేపుతుంటారు. బహిరంగ వేదికలపై తనదైన శైలిలో ధైర్యంగా మాట్లాడటం, సమాజంలోని సమస్యలను నేరుగా చూపించడం వల్ల ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.కంగనా (Kangana Ranaut) మాట్లాడుతూ, పెళ్లయిన పురుషులతో సంబంధాల విషయంలో సమాజం ఎల్లప్పుడూ మహిళలపైనే నిందలు మోపుతుందని స్పష్టం చేశారు. తన కెరీర్ను, భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని కృషి చేసే యువతులు కొన్నిసార్లు పెళ్లయిన, పిల్లలు ఉన్న పురుషుల ఆకర్షణకు గురయ్యే పరిస్థితులు వస్తాయని ఆమె తెలిపారు. అలాంటి సందర్భాల్లో సమాజం ఆ పురుషుడి తప్పును విస్మరించి, కేవలం ఆ అమ్మాయి మీదే వేలెత్తి చూపడం అన్యాయం అని విమర్శించారు.”ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలతో పెళ్లయిన వ్యక్తి సంబంధం పెట్టుకోవాలని చూస్తే, అది అతని తప్పు కాదా? కానీ నింద మాత్రం అమ్మాయి మీదే వేస్తారు” అని ఆమె పేర్కొన్నారు.
డేటింగ్ యాప్ల వాడకంపై కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
అదేవిధంగా, ఆధునిక డేటింగ్ యాప్ (dating app) ల వాడకంపై కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని “సమాజంలోని మురికి కాలువలు”గా అభివర్ణించారు. ఆత్మవిశ్వాసం కొరవడిన వారు, ఇతరుల గుర్తింపు కోసం ఆరాటపడే వారే ఇలాంటి యాప్లను ఆశ్రయిస్తారని ఆమె విమర్శించారు. యువత తమ జీవిత భాగస్వాములను చదువుకునే రోజుల్లో గానీ, పెద్దలు కుదిర్చిన వివాహాల ద్వారా గానీ ఎంచుకోవడం ఉత్తమమని ఆమె సూచించారు.లివ్-ఇన్ రిలేషన్షిప్లు మహిళలకు ఏమాత్రం సురక్షితం కావని కంగనా స్పష్టం చేశారు. ఇలాంటి సహజీవనంలో అమ్మాయి గర్భం దాల్చితే కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లభించదని, దీనివల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. మొత్తంగా ఆధునిక సంబంధాల కన్నా సంప్రదాయ పద్ధతులే శ్రేయస్కరమనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC







